ఆగడు కటౌట్: కాల్వలోకి దూకిన మహేష్ అభిమాని
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ అలంకార్ థియేటర్ వద్ద అభిమానులు మహేష్ బాబు నటించిన 'ఆగడు' సినిమా భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. కటౌట్ను తొలగించేందుకు అధికారులు యత్నించడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
అధికారుల వైఖరికి నిరసనగా మహేష్ బాబు ఓ అభిమాని ఒకరు పక్కనే ఉన్న ఏలూరు కాల్వలోకి దూకడంతో స్థానికులు అతనిని కాపాడారు.
సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో విజయవాడ అలంకార్ సెంటర్లో 90 అడుగుల కటౌట్ను అభిమానులు ఏర్పాటు చేశారు. దీనిపై అధికారులు అభ్యంతరం తెలిపారు. అనుమతి లేదంటూ తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అధికారులకు, మహేశ్ బాబు అభిమానులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఓ అభిమాని కటౌట్ పైనుంచి కాల్వలోకి దూకాడు.
కాగా, మహేష్ బాబు, తమన్నా నటించిన 'ఆగడు' సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఆగడు చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. దర్శకుడు శ్రీనువైట్ల.