కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెల్‌ఫోన్ పేలి వ్యక్తి మృతి, మృతుడు మహారాష్ట్ర కూలి

By Pratap
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: కరీంనగర్ జిల్లా గంభీరరావుపేట మండలంలోని నాగంపేట గ్రామ సమీపంలో ఆదివారం సెల్‌ఛార్జర్‌ పేలి సూర్య వంశీ రాందాస్‌ (35) అనే కూలీ మృతి చెందాడు. నాగంపేట శివారులో శ్రీగాధకు చెందిన సతీష్‌ అనే వ్యక్తి కోళ్ల పారం నడిపిస్తున్నాడు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన సూర్య వంశీ రాం దాస్‌ అనే వ్యక్తి కోళ్ళపారంలో ఏడాదిన్నర క్రితం కూలీగా చేరాడు.

కోళ్లకు దాణాతో పాటు నీళ్లు అందించడం తదితర పనుల ను రాందాస్‌ చేసేవాడు. ఆదివారం సెల్‌కు ఛార్జింగ్‌ పెట్టేందుకు ఛార్జర్‌ ప్లగ్‌ను కరెంటు బోర్డుకు పెట్టాడు. ఒక్కసారిగా ఛార్జర్‌ పేలి రాందాస్‌ పడిపోయాడు. దీంతో అక్కడే ఉన్న తోటి కూలీలు మరికొందరు కలిసి అపస్మారకస్థితిలో ఉన్న రాందాస్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా మృతిచెందాడు. సెల్‌ ఛార్జర్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి భార్య రాజుబాయి, కూతురు ఉన్నాడు. ఎస్‌ఐ రవీందర్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Man killed in cell phone blast

కొడిమ్యాల మండలంలోని చెప్యాల క్రాస్‌ రోడ్డు నుంచి దొంగలమర్రి వైపు వెళ్ళే రహదారిపై ఆదివారం ట్రాక్టర్‌ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కందకంలో బోల్తా పడింది. దీంతో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. వేములవాడ మండలం శాత్రాజ్‌పల్లి గ్రామానికి చెందిన ఎండి సద్దాంహుస్సేన్‌ (22) ట్రాక్టర్‌పై ఇసుకను తీసుకెళ్ళి, తిరిగి దొంగలమర్రి వైపు నుంచి చెప్యాల వైపు వస్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్‌పై ఇంజన్‌ పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కొడిమ్యాల ఏఎస్సై వహీద్‌పాషా తెలిపారు.

హుస్నాబాద్‌ మండలం పం దిల్ల గ్రామంలో తాడూరి మణెమ్మ(52) అనే వితంతువు పింఛన్‌ రాలేదనే బెంగతో ఆదివారం గుండెపోటుతో మృ తిచెందింది. పందిల్ల గ్రామానికి చెందిన మణెమ్మ భర్త పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుం చి మణెమ్మ వితంతువు పింఛను పొందుతోంది. మూడు రోజుల క్రితం పందిల్లలో అధికారులు పింఛన్లు పంపిణీచేశారు. అందులో మణెమ్మ పేరు, తన తల్లి కనుకమ్మ పంపిణీ జాబితాలో లేకపోవడంతో తీవ్ర మనస్థాపం చెం దింది. ఆదివారం ఉదయం పింఛన్‌ బెంగతో గుం డెపోటుకు గురై మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతురాలు మణెమ్మకు ఇద్దరు కుమారులున్నారు.

English summary
Maharashtra worker killed in a cell phone blast in Karimnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X