భార్యను చంపి శవంతో పిఎస్కు: భర్తను చంపిన భార్య
హైదరాబాద్: చిత్తూరు జిల్లా సంగరాయకుంటలో దారుణం చోటు చేసుకుంది. సలీం అనే వ్యక్తి భార్యపై అనుమానం పెంచుకుని ఆమెను హత్య చేశాడు. గత రాత్రి కత్తితో పొడిచి పాశవికంగా హత్య చేశాడు. ఆ తర్వాత అతడు భార్య శవంతో పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బోదవాడ గ్రామంలో భర్తను హత్య చేసింది. గ్రామానికి కామేష్ (30)ను అతని భార్య లక్ష్మి బ్లేడుతో గొంతు కోసి చంపింది. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం.
వివాహేతర సంబంధం కారణంగానే ఆమె భర్తను హత్య చేసినట్లు భావిస్తున్నారు. చిల్లకల్లు ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.