మంచి అభ్యర్థిని ఎన్నుకోండి: యువత పిలుపు(పిక్చర్స్)
హైదరాబాద్: మేము మా ఓటు హక్కును వినియోగించుకుంటున్నాం.. మీరూ మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని నగరంలోని ముఫాఖాన్ జాహ్ ఇంజినీరింగ్ కాలేజి విద్యార్థులు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం కాలేజి విద్యార్థులు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
మంచి పాలన అందించే సరైన అభ్యర్థులకే ఎన్నికల్లో ఓటు వేయాలని విద్యార్థులు పిలుపునిచ్చారు. నేను ఓటు వేస్తున్నా.. మీరూ ఓటు వేయండనే ప్ల కార్డులను ప్రదర్శించిన విద్యార్థులు.. మంచి దేశం కోసం ఓటు వేయాలని, మంచి అభ్యర్థి కోసం ఓటు వేయాలని నినాదాలు చేశారు. తమ అసంతృప్తిని తెలియజేసేందుకు ‘నోటా'కు ఓటు వేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమర్ జావీద్ తోపాటు పలువురు విద్యార్ఠినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
నినాదాలు చేస్తూ..
మేము మా ఓటు హక్కును వినియోగించుకుంటున్నాం.. మీరూ మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని నగరంలోని ముఫాఖాన్ జాహ్ ఇంజినీరింగ్ కాలేజి విద్యార్థులు పిలుపునిస్తున్నారు.
ప్ల కార్డులతో..
నేను ఓటు వేస్తున్నా.. మీరూ ఓటు వేయండనే ప్ల కార్డులను ప్రదర్శించిన విద్యార్థులు.. మన దేశం కోసం ఓటు వేయాలని, మంచి అభ్యర్థి కోసం ఓటు వేయాలని నినాదాలు చేశారు.
సరైన అభ్యర్థికే ఓటు
మంచి పాలన అందించే సరైన అభ్యర్థులకే ఎన్నికల్లో ఓటు వేయాలని విద్యార్థులు పిలుపునిచ్చారు.
నచ్చకపోతే ‘నోటా'
తమ అసంతృప్తిని తెలియజేసేందుకు ‘నోటా'కు ఓటు వేయవచ్చని విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమర్ జావీద్ తోపాటు పలువురు విద్యార్ఠినీ, విద్యార్థులు పాల్గొన్నారు.