బాబు భేటీలు, తలసాని సోదరుడికి ఓదార్పు (ఫొటోలు)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సోమవారం పలువురు కలిశారు. చెస్ ఒలింపియాడ్లో రజత పతకం గెలుచుకున్న లలిత్ బాబును ఆయన శాసనసభ ఆవరణలో అభినందించారు. లలిత్ బాబు చంద్రబాబును కలిశారు.
గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణపతకం సాధించిన వికలాంగుడైన క్రీడాకారుడు కార్తిక్ కూడా చంద్రబాబును కలిశారు. కార్తిక్ను చంద్రబాబు అభినందించారు. సెంటినీ గ్రూప్ ప్రతినిధులు చంద్రబాబును కలిశారు
తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ సోదరుడి కుటుంబ సభ్యులను చంద్రబాబు ఓదార్చారు. శ్రీనివాస యాదవ్ సోదరుడు తన కుమారుడిని కోల్పోయారు.
లలిత్ బాబుతో ఇలా..
చెస్ ఒలింపియాడ్లో రజత పతకం సాధించిన లలిత్ బాబును చంద్రబాబు నాయుడు అభినందించారు.
కార్తిక్కు బాబు అభినందలనలు
ఇటీవలి గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణపతకం గెలుచుకున్న కార్తిక్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు.
సెంటినీ గ్రూప్ ప్రతినిధులు
సెంటినీ గ్రూప్ ప్రతినిధులు సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలుసుకున్నారు.
తలసాని సోదరుడి కుటుంబ సభ్యులతో..
తలసాని శ్రీనివాస యాదవ్ సోదరుడి కుటుంబ సభ్యులను చంద్రబాబు నాయుడు పరామర్శించారు.
తలసాని సోదరుడి కుటుంబ సభ్యులతో...
తలసాని శ్రీనివాస యాదవ్ కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. తలసాని శ్రీనివాస యాదవ్ను కూడా చూడవచ్చు.
అపాచీ ఫుట్ వియర్ ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అపాచీ ఫుట్ వియర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ కలిశారు.