రైలు ప్రమాదం: నారా లోకేష్ ఓదార్పు ఇలా (పిక్చర్స్)
హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట రైలు ప్రమాద ఘటనలో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు మెరుగైన పరిహారం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్ చెప్పారు.
రైలు ప్రమాదంలో మరణించిన విద్యార్ధుల కుటుంబ సభ్యులకు ఆర్ధిక సాయం అందించేందుకు లోకేష్ మెదక్ జిల్లాలో బుధవారం నాడు పర్యటించారు. తెలుగువారు ఎక్కుడున్నా తమ పార్టీ ఆదుకుంటుందని ఆయన చెప్పారు.
గజ్వేల్లోని తూఫ్రాన్, ఇస్లామ్పూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయపల్లి, కిష్టాపూర్, గన్పూర్, వేలూరులలో పర్యటించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రత్యేకంగా ఆర్ధిక సాయం అందించారు. ఒకొక్కరికీ లక్ష రూపాయిల వంతున ఆర్ధిక సాయం అందించారు. వారికి చెక్కులు అందించారు.
నారా లోకేష్ ఇలా...
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఘటనల్లో బాధితులను ఆదుకోవడంలో తమ నాయకుడు చంద్రబాబు స్పందించారని నారా లోకేష్ చెప్పారు.
నారా లోకేష్ ఇలా..
రైలు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించిన తర్వాత నారా లోకేష్ ప్రమాదం తీరును అడిగి తెలుసుకున్నారు. మృతులకు నివాళులు అర్పించారు
నారా లోకేష్ ఇలా..
బాధిత కుటుంబాలకు చెందిన మిగతా చిన్నారుల చదువు బాధ్యతను తాము తీసుకుంటామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.
నారా లోకేష్ ఇలా..
బాధిత కుటుంబాల పిల్లలకు ఆర్థిక సాయం, చదువు వంటివి ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో సమకూరుస్తామని నారా లోకేష్ చెప్పారు.
నారా లోకేష్ ఇలా..
మృతి చెందిన బస్సు డ్రైవర్ భిక్షపతి గౌడ్, క్లీనర్ రమేష్ కుటుంబాలను పరామర్శించిన లోకేష్ వారికి లక్ష రూపాయలేసి ఆర్థిక సాయం అందించారు.
నారా లోకేష్ ఇలా...
నారా లోకేష్ వెంట తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, టిడిపి జిల్లా అధ్యక్షురాలు శశికళా యాదవ రెడ్డి, శాసనసభ్యులు, పార్టీ నాయకులు ఉన్నారు.
నారా లోకేష్ ఇలా..
రైలు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలను టిడిపి నాయకుడు నారా లోకేష్ ఇలా ఓదార్చారు.
నారా లోకేష్ ఇలా..
రైలు ప్రమాదంలో మరణించినవారి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ భరోసా ఇచ్చారు.
నారా లోకేష్ ఇలా..
తమను పరామర్శించాడనికి వచ్చిన నారా లోకేష్ను చూసి బాధిత కుటుంబాలకు చెందినవారు బిడ్డలు పోయిన దుఖ్కాన్ని పంచుకున్నారు.
నారా లోకేష్ ఇలా..
తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా తమ పార్టీ ఆదుకుంటుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ బాధితులకు హామీ ఇచ్చారు.
నారా లోకేష్ ఇలా...
బాధిత కుటుంబాలకు చెందినవారు తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ను ఆలింగనం చేసుకుని తమ వేదనను వినిపించారు.
నారా లోకేష్ ఇలా..
రైలు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాల సభ్యులను నారా లోకేష్ పరామర్సించారు. వారికి ఆర్థిక సాయం అందించారు.
నారా లోకేష్ ఇలా..
తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ రైలు ప్రమాదంలో మరణించిన చిన్నారుల కుటుంబ సభ్యుల భుజం తట్టారు.
నారా లోకేష్ ఇలా...
తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ రైలు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు చెందినవారిని కలుసుకున్నారు.
నారా లోకేష్ ఇలా...
తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ రైలు ప్రమాదంలో మరణించిన చిన్నారులకు నివాళులు అర్పించారు.
నారా లోకేష్ ఇలా...
పుట్టెడు దుఖ్కంతో తల్లడిల్లుతున్న చిన్నారుల తల్లులకు నేనున్నాంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
నాలా లోకేష్ ఇలా..
రైలు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు చెందినవారిని నారా లోకేష్ పలకరించి, ఓదార్పు మాటలు చెప్పారు.
నారా లోకేష్ ఇలా...
చిన్నారులను కోల్పోయిన కుటుంబాల్లోని ఇతర పిల్లల చదువుల బాధ్యత ఎన్టీఆర్ ట్రస్టు తరఫున తాము తీసుకుంటామని నారా లోకేష్ చెప్పారు.
నారా లోకేష్ ఇలా..
తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ మెదక్ జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలతో కలిసిపోయారు.
నారా లోకేష్ ఇలా...
రైలు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాల సభ్యులను కలిసి నారా లోకేష్ ఆత్మీయంగా మాట్లాడారు. వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు.