నవజీవన్ ఎక్స్ప్రెస్లో దోపిడీ, బందీలుగా మహిళలు
విజయవాడ: న్యూఢిల్లీ నుంచి చెన్నై వెళుతున్న నవజీవన్ ఎక్స్ప్రెస్లో సోమవారం తెల్లవారుజామున దోపిడీ జరిగింది. మహారాష్ట్రలోని వరద - బలాస వద్ద ఉదయం 2.30 గంటల ప్రాంతంలో దోపిడీ జరిగినట్లు బాధితులు విజయవాడ రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ పోలీసులు ఫిర్యాదు చేశారు.
ఈ దోపిడిని ఉదయం గమనించిన ప్రయాణీకులు విజయవాడ జీఆర్పీకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 30మందికి పైగా దొంగలు ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులు దోచుకున్నారు. రూ. 2 లక్షలకు పైగా నగదు, బంగారం దుండగులు దొంగిలించినట్లు బాధితులు పేర్కొన్నారు. విజయవాడ జీఆర్పీ సీఐ శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేసి సిక్రింద్రాబాద్ డివిజన్కి కేసు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు.
ఐదుగురిని బంధించిన స్దానికులు
ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలం జౌలి గ్రామంలో దారుణం జరిగింది. మంత్రాల నెపంతో ఐదుగురిని స్దానికులు నిర్బందించారు. రాత్రి నుంచి పంచాయితీ కార్యాలయంలో వారు బందీలుగా ఉన్నారు. బాధితుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.