'మోడీ స్వచ్ఛ భారత్కు టీడీపీ నాటి పథకమే స్ఫూర్తి'
న్యూఢిల్లీ: పరిశుభ్ర భారత్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న స్వచ్ఛ భారత్ మిషన్కు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమమే స్ఫూర్తి అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గురువారం చెప్పారు.
ప్రధాని కంటే ఒకరోజు ముందే ఆయన ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ విమానాశ్రయంలో ప్రారంభించారు. ఇందులో భాగంగా మంత్రి స్వయంగా చీపురు పట్టి విమానాశ్రయ ప్రాంగణాన్ని ఊడ్చారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడారు. దేశం పరిశుభ్రంగా ఉండాలని మహాత్మా గాంధీ చెప్పినా ఇప్పటి వరకూ ఆ విషయాన్ని పట్టించుకోలేదన్నారు.
ప్రజలంతా పరిశుభ్రంగా ఉంటే దేశం కూడా పరిశుభ్రంగా ఉంటుందన్నారు. వ్యాధులూ దరిచేరవన్నారు. పరిశుభ్ర భారత్ను ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ప్రజా ఉద్యమంగా చేపట్టాలని ప్రధాని భావిస్తున్నట్టు కేంద్రమంత్రి వెంకయ్య నాయడు చెప్పారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితోనే ప్రధాని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు కూడా ఇందులో పాలుపంచుకోవాలన్నారు.