వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మోడీ స్వచ్ఛ భారత్‌కు టీడీపీ నాటి పథకమే స్ఫూర్తి'

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పరిశుభ్ర భారత్‌ కోసం ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న స్వచ్ఛ భారత్‌ మిషన్‌‌కు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమమే స్ఫూర్తి అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు గురువారం చెప్పారు.

ప్రధాని కంటే ఒకరోజు ముందే ఆయన ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని సఫ్దర్‌ జంగ్‌ విమానాశ్రయంలో ప్రారంభించారు. ఇందులో భాగంగా మంత్రి స్వయంగా చీపురు పట్టి విమానాశ్రయ ప్రాంగణాన్ని ఊడ్చారు. ఈ సందర్భంగా అశోక్‌ మాట్లాడారు. దేశం పరిశుభ్రంగా ఉండాలని మహాత్మా గాంధీ చెప్పినా ఇప్పటి వరకూ ఆ విషయాన్ని పట్టించుకోలేదన్నారు.

pachadanam-parisubhratha is inspiration to Modi's Swachh Bharat Abhiyan

ప్రజలంతా పరిశుభ్రంగా ఉంటే దేశం కూడా పరిశుభ్రంగా ఉంటుందన్నారు. వ్యాధులూ దరిచేరవన్నారు. పరిశుభ్ర భారత్‌ను ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ప్రజా ఉద్యమంగా చేపట్టాలని ప్రధాని భావిస్తున్నట్టు కేంద్రమంత్రి వెంకయ్య నాయడు చెప్పారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితోనే ప్రధాని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు.ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు కూడా ఇందులో పాలుపంచుకోవాలన్నారు.

English summary
pachadanam-parisubhratha is inspiration to Modi's Swachh Bharat Abhiyan, says Ashok Gajapati Raju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X