నివాళి: తెరాస, కాంగ్రెస్ నేతలతో వాసిరెడ్డి పద్మ(పిక్చర్స్)
హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద పాఠశాల బస్సును రైలు ఢీకొన్న ఘటనలో మృతి చెందిన విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ కే కేశవ రావు తదితరులు కేబీఆర్ పార్క్ వద్ద నివాళులు అర్పించారు.
మహేందర్ రెడ్డి, కేశవ రావు తదితరులు కొవ్వొత్తులతో హైదరాబాదులోని కేబీఆర్ పార్క్ వద్ద మాసాయిపేట ఘటనలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ కేశవ రావు, మాజీ మంత్రి గీతా రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు.
మహేందర్ రెడ్డి
కేబీఆర్ పార్క్ వద్ద మాసాయిపేట మృతులకు తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి గీతా రెడ్డి, ఎంపీ కే కేశవ రావు నివాళులు అర్పించారు. ఈ సమయంలో బాధితులను ఓదార్చుతున్న మహేందర్ రెడ్డి
మహేందర్ రెడ్డి
హైదరాబాదులోని కేబీఆర్ పార్క్ వద్ద మాసాయిపేట మృతుల కుటుంబాలను ఓదార్చుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి దృశ్యం.
కొవ్వొత్తుల నివాళి
కేబీఆర్ పార్క్ వద్ద మాసాయిపేట మృతులకు కొవ్వొత్తుల నివాళి అర్పిస్తున్న మహేందర్ రెడ్డి, గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు.
నివాళి
కేబీఆర్ పార్క్ వద్ద మాసాయిపేట మృతులకు కొవ్వొత్తుల నివాళి అర్పిస్తు్నన మహేందర్ రెడ్డి, గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు.
మహేందర్ రెడ్డి
హైదరాబాదులోని కేబీఆర్ పార్క్ వద్ద కొవ్వొత్తులతో నివాళి అర్పిస్తున్న మంత్రి మహేందర్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య. ఈ సందర్భంగా న్యూస్ ఛానల్తో మాట్లాడుతున్న మహేందర్ రెడ్డి.
కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్, తెరాస
హైదరాబాదులోని కేబీఆర్ పార్క్ వద్ద మాసాయిపేట మృతులకు నివాళులు అర్పిస్తున్న మహేందర్ రెడ్డి, కే కేశవ రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వాసిరెడ్డి పద్మ.