గంజాయితో దొరికిపోయిన తమిళవాసులు (పిక్చర్స్)
విశాఖపట్నం: అక్రమంగా గంజాయిని కలిగి ఉన్న నలుగురిని టూటౌన్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. టూటౌన్ పోలీసు స్టేషన్లో విలేకరుల సమావేశంలో తూర్పు ప్రాంత ఏసీపీ మహేష్ వివరాలు వెల్లడించారు.
సీఐ టీ కళ్యాణి, ఎస్సై సిహెచ్ వెంకటరావు సిబ్బందితో కలిసి అల్లిపురం ప్రాంతంలోని లాడ్జిలలో తనిఖీలు నిర్వహించారని ఏసీపీ తెలిపారు. కేఎన్ఆర్ లాడ్జిలో ఉన్న తమిళనాడులోని కంభం ప్రాంతానికి చెందిన పల్చమి వాన్రాజ్, ఎళయేంద్రన్, చిన్నతోరై శివమణి, అరుణ్ కుమార్ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారని తెలిపారు.
దీంతో పోలీసులు వారి బ్యాగులను తనిఖీ చేయగా, నాలుగు కిలోల గంజాయి బయటపడిందని చెప్పారు. దానిని స్వాధీనం చేసుకొని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు.
విశాఖ
అక్రమంగా గంజాయిని కలిగి ఉన్న నలుగురిని టూటౌన్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. టూటౌన్ పోలీసు స్టేషన్లో విలేకరుల సమావేశంలో తూర్పు ప్రాంత ఏసీపీ మహేష్ వివరాలు వెల్లడించారు.
విశాఖ
సీఐ టీ కళ్యాణి, ఎస్సై సిహెచ్ వెంకటరావు సిబ్బందితో కలిసి అల్లిపురం ప్రాంతంలోని లాడ్జిలలో తనిఖీలు నిర్వహించారని ఏసీపీ తెలిపారు.
విశాఖ
కేఎన్ఆర్ లాడ్జిలో ఉన్న తమిళనాడులోని కంభం ప్రాంతానికి చెందిన పల్చమి వాన్రాజ్, ఎళయేంద్రన్, చిన్నతోరై శివమణి, అరుణ్ కుమార్ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారని తెలిపారు.
విశాఖ
దీంతో పోలీసులు వారి బ్యాగులను తనిఖీ చేయగా, నాలుగు కిలోల గంజాయి బయటపడిందని చెప్పారు. దానిని స్వాధీనం చేసుకొని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు.