మెన్స్ డే కోసం కవిత, లక్ష్మీప్రసన్న నవ్వులు (పిక్చర్స్)
హైదరాబాద్: ఎఫ్ఐసిసిఐ ఎఫ్ఎల్ఓ, యెల్లో థార్స్ డే, జెఆర్సీ కన్వెన్షన్ అండ్ ట్రేడ్ అఫైర్స్ల భాగస్వామ్యంతో ఆరోగ్య సాధికారత కార్యక్రమాన్ని ప్రపంచ మహిళా దినోత్సవం మార్చి 8న జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్, జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్స్ నిర్వహించింది.
ఈ కార్యక్రమాన్ని ప్రముఖ నటి లక్ష్మీ ప్రసన్న, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ హెడ్ కిర్షా రెడ్డిలు అధికారికంగా ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవం సందర్భంగా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి శనివారం కీలక సందేశాన్ని ప్రజలకు అందించారు.
ఐ యామ్ ఏ లేడీ
రోజువారి జీవనశైలి, ఒత్తిడి ఆరోగ్యపరంగా ముందుగా వచ్చే రుతువిరత, చికాకు పెట్టే పేగువ్యాధి, అలసట, చర్మ సమస్యలతో పాటు ప్రమాదభరితమైన క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తున్నాయి.
ఐ యామ్ ఏ లేడీ
డాక్టర్ రూమ సిన్హా (గైనకాలజిస్ట్), డాక్టర్ ఆష సుబ్బలక్ష్మి (గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్), డాక్టర్ వినితా రెడ్డి (ఆంకాలజిస్ట్), డాక్టర్ పల్లవి రెడ్డి (డెర్మటాలజిస్ట్)లతో అపోలో హెల్త్ సిటీకి చెందిన ప్రఖ్యాత వైద్య బృందం ఇటువంటి పలురకాల సమస్యలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు.
ఐ యామ్ ఏ లేడీ
శ్రీమతి విజయ తుపురాణిచే నిర్వహించబడిన జుంబ సదస్సు, ఆరోగ్యకరమైన భోజనంపై ప్రదర్శింపబడిన గుడ్ మీల్ డెమోను ప్రేక్షకులు ఆసక్తిగా తిలకించారు.
ఐ యామ్ ఏ లేడీ
ఈ కార్యక్రమంలో ఔత్సాహికుల కొరకు ఫోటోగ్రఫీ, కళా ప్రదర్సన, సాధారణ పెయింటింగ్లు ఏర్పాటు చేయబడ్డాయి. కార్యక్రమంలో మహిళా సృజనాత్మకత, ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించేందుకు శ్రీమతి లూణ లోగన్చే ఏర్పాటైన ఫోటోగ్రఫీ, కళా ప్రదర్శన మహిళలచే గొప్ప ఆధరణను అందుకున్నాయి.
ఐ యామ్ ఏ లేడీ
సంగీతా రెడ్డి మాట్లాడుతూ... ఆరోగ్యం అనేది అతి ముఖ్యమైన విషయం, ఈ కార్యక్రమం మహిళల యొక్క సంపూర్ణ ఆరోగ్యాన్ని ఉద్దేశిస్తోందన్నారు.
ఐ యామ్ ఏ లేడీ
ఐ యామ్ ఏ లేడీ అనబడే ఆన్ లైన్ పోర్టల్ మహిళల ఆరోగ్యం, సంక్షేమానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుందని, ఈ పోర్టల్ వివిధ రంగాలకు చెందిన మహిళల వ్యక్తపరిచే ఆలోచనలు, కళలు, ఆశయం ప్రయోజనాలు, ఆందోళనలకు ఒక వేదికవుతుందని చెప్పారు.
ఐ యామ్ ఏ లేడీ
చైనాలో శిశు మరణాల సంఖ్య 6000 కాగా, మన దేశంలో 56000గా ఉండటంతో మహిళల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని సంగీతా రెడ్డి అన్నారు.
ఐ యామ్ ఏ లేడీ
మంచు లక్ష్మీ మాట్లాడుతూ... మనం కోరుకునే మార్పును, పర్యావరణంలో మన కుటుంబాలు తీసుకు వచ్చే మార్పు ద్వారా సాధించవచ్చునని, సమాజంలో వచ్చే ఈ మార్పును మనం గమనించవచ్చునని చెప్పారు.
ఐ యామ్ ఏ లేడీ
కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. కేవలం మహిళలు మాత్రమే మహిళా దినోత్సవాన్ని ఎందుకు కలిగి ఉండాలని, పురుషులు కూడా పురుషుల దినోత్సవాన్ని కలిగి ఉండాలని, ప్రతిరోజు పురుషులదే పైచేయి అవుతుండటంతో మహిళలకు ఒకే ఒకరోజు కేటాయించబడిందన్నారు.
ఐ యామ్ ఏ లేడీ
ఎఫ్ఐసిసిఐ ఎఫ్ఎల్ఓ, యెల్లో థార్స్ డే, జెఆర్సీ కన్వెన్షన్ అండ్ ట్రేడ్ అఫైర్స్ల భాగస్వామ్యంతో ఆరోగ్య సాధికారత కార్యక్రమాన్ని ప్రపంచ మహిళా దినోత్సవం మార్చి 8న జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్, జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్స్ నిర్వహించింది.