మళ్లీ జరగొద్దు: పవన్, అందరిదీ, ప్రమాదం వద్ద(పిక్చర్స్)
మెదక్/హైదరాబాద్: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసెంజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ సహా 16 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. సంఘటన స్థలాన్ని పలువురు రాజకీయ నాయకులు సందర్శించి, బాధితులను పరామర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తదితరులు యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు.
వైయస్ జగన్, పొన్నాల లక్ష్మయ్య, గద్దర్, గీతా రెడ్డి తదితరులు మెదక్ జిల్లాలోని సంఘటన ప్రాంతాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించారు. సంఘటన స్థలం హృదయవిదారకంగా ఉంది.
గీతా రెడ్డి
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న సంఘటన ప్రాంతంలో బాధితులను పరామర్శిస్తున్న గీతారెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
కన్నీరుమున్నీరు
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న సంఘటన ప్రాంతంలో బాధితులు కన్నీరుమున్నీరు.
రైలు ప్రమాదం సంఘటన ప్రాంతం
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న సంఘటన ప్రాంతంలో బాధితులు కన్నీరుమున్నీరు.
బస్సు
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న సంఘటన ప్రాంతంలో బస్సు ఇలా...
బస్సు
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న సంఘటన ప్రాంతంలో బస్సు ఇలా...
జగన్
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న సంఘటన ప్రాంతంలో బాధితులను పరామర్శిస్తున్న జగన్ దృశ్యం. జగన్ మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
జగన్
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న సంఘటన ప్రాంతంలో బాధితులను పరామర్శిస్తున్న జగన్, గద్దర్ దృశ్యం. ఈ ప్రమాదంలో రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల యాజమాన్యం.. ఇలా అందరి పాత్ర ఉందని గద్దర్ అన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సికింద్రాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, పసివారి హృదయవిదారక యాతన చూస్తుంటే ఏం చేయాలో పాలుపోవడం లేదన్నారు.