కేసీఆర్తో మిస్ఇండియా పర్ఫెక్ట్, ఫ్లవర్స్ ఇచ్చి(పిక్చర్స్)
హైదరాబాద్: మిస్ ఇండియా పర్ఫెక్ట్ 2014 రష్మి బుధవారం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో భేటీ అయ్యారు.
కరీంనగర్ జిల్లా రామగుండంకు చెందిన రష్మీ ఇటీవల అందాల పోటీలో మిస్ ఇండియా పర్ఫెక్ట్, మిస్ ఇండియా బ్యూటీఫుల్ (ఆందమైన కళ్ళ ఆకృతి విభాగంలో) అవార్డులను గెలుచుకున్నారు.
తనను కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మిస్ ఇండియా పర్ఫెక్ట్ రష్మీకి ఆయన అభినందనలు తెలిపారు.
కేసీఆర్తో రష్మీ
మిస్ ఇండియా పర్ఫెక్ట్ 2014 రష్మి బుధవారం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో భేటీ అయ్యారు.
కేసీఆర్తో రష్మీ
కరీంనగర్ జిల్లా రామగుండంకు చెందిన రష్మీ ఇటీవల అందాల పోటీలో మిస్ ఇండియా పర్ఫెక్ట్, మిస్ ఇండియా బ్యూటీఫుల్ (ఆందమైన కళ్ళ ఆకృతి విభాగంలో) అవార్డులను గెలుచుకున్నారు.
సానియా మీర్జా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును రెండు రోజుల క్రితం టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కలిసిన విషయం తెలిసిందే.
పుల్లెల గోపీచంద్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును పలువురు పారిశ్రామికవేత్తలతో పాటు సినీ, క్రీడా రంగ ప్రముఖులు కూడా కలుస్తున్నారు. ఇందులో భాగంగా క్రీడాకారిణి సోనియా, మిస్ ఇండియా పర్ ఫెక్ట్ రష్మి తదితరులు కలిశారు. పుల్లెల గోపీచంద్ కూడా త్వరలో కలుస్తారని వార్తలు వచ్చాయి.