మూడున్నరేళ్లలో: మెట్రోపై శ్రీధరన్తో బాబు (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో రెండు మెట్రో రైళ్ల ప్రాజెక్టులను రాబోయే మూడున్నర ఏళ్లలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ, వీజీటీఎం పరిధిలో చేపట్టిన ఈ రెండు మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణాల బాద్యతలను ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్కు అప్పగించారు. సోమవారం అసెంబ్లీలోని తన కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఢిల్లీ మెట్రో రూపశిల్పి శ్రీధరన్తో భేటీ అయ్యారు.
రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణానికి సలహాదారుగా ఉండాల్సిందిగా శ్రీధరన్ను కోరగ.. ఆయన దానికి అంగీకరించారు. మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని శ్రీధరన్ను సీఎం కోరారు. మూడున్నర ఏళ్లలో రెండు మెట్రో ప్రాజెక్టులను పూర్తి చేసే అంశంపై ఇరువురు చర్చించారు.
ఢిల్లీ మెట్రో తరహాలోనే ఏపీ మెట్రో రైలు ప్రాజెక్టులను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేయాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తామన్నారు. విశాఖ, విజయవాడలతో పాటు తిరుపతి నగరంలో కూడా మెట్రో రైలు ప్రాజెక్టు రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శ్రీధరన్ - చంద్రబాబు
తిరుపతి కూడా ప్రధాన నగరంగా ఎదుగుతున్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ కూడా మెట్రో రైలు అవసరాన్ని గుర్తించారు. తిరుపతి మెట్రో రైలు ప్రాజెక్టుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు.. శ్రీధరన్ను కోరారు.
శ్రీధరన్ - చంద్రబాబు
ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణా రావు, కమ్యూనికేషన్స్ అడ్వైజర్ పరకాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో రెండు మెట్రో రైళ్ల ప్రాజెక్టులను రాబోయే మూడున్నర ఏళ్లలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ, వీజీటీఎం పరిధిలో చేపట్టిన ఈ రెండు మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణాల బాద్యతలను ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్కు అప్పగించారు.
మెట్రో
సోమవారం అసెంబ్లీలోని తన కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఢిల్లీ మెట్రో రూపశిల్పి శ్రీధరన్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణానికి సలహాదారుగా ఉండాల్సిందిగా శ్రీధరన్ను కోరాగ.. ఆయన దానికి అంగీకరించారు.
మెట్రో
ఆంధ్రప్రదేశ్లో రెండు మెట్రో రైళ్ల ప్రాజెక్టులను రాబోయే మూడున్నర ఏళ్లలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మెట్రో
విశాఖ, వీజీటీఎం పరిధిలో చేపట్టిన ఈ రెండు మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణాల బాద్యతలను ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్కు అప్పగించారు.
మెట్రో
సోమవారం అసెంబ్లీలోని తన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఢిల్లీ మెట్రో రూపశిల్పి శ్రీధరన్తో భేటీ అయ్యారు.
మెట్రో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణానికి సలహాదారుగా ఉండాల్సిందిగా శ్రీధరన్ను కోరగా.. ఆయన దానికి అంగీకరించారు.
మెట్రో
మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని శ్రీధరన్ను సీఎం కోరారు. మూడున్నర ఏళ్లలో రెండు మెట్రో ప్రాజెక్టులను పూర్తి చేసే అంశంపై ఇరువురు చర్చించారు.
మెట్రో
ఢిల్లీ మెట్రో తరహాలోనే ఏపీ మెట్రో రైలు ప్రాజెక్టులను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేయాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తామన్నారు.
మెట్రో
విశాఖపట్నం, విజయవాడలతో పాటు తిరుపతి నగరంలో కూడా మెట్రో రైలు ప్రాజెక్టు రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.