రెక్కీ, పట్టపగలే చోరీ, ఈ అపార్టుమెంట్లోనే (పిక్చర్స్)
హైదరాబాద్: రాజధానిలోని నారాయణగూడలో పట్టపగలే ఓ అపార్ట్మెంట్లో చోరీకి జరిగింది. దొంగలు కిలో బంగారు నగలను లూటీ చేశారు.
నారాయణగూడ సీఐ ఎస్ .భీంరెడ్డి, డీఐ బి లక్ష్మినారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణగూడ - బర్కత్పుర రోడ్డులో రెడ్డి మహిళా కళాశాల ఎదురుగా ఉన్న వీధిలో శ్రీకృష్ణధామ్ అపార్ట్మెంట్ ఉంది.
ఇందులోని రెండో అంతస్థులో ఉన్న 201 ఫ్లాట్లో ఆర్వీ జోషీ అనే ఫార్మా వ్యాపారి నివసిస్తున్నారు. వారు ఇంట్లో లేనప్పుడు ఈ చోరీ జరిగింది.
దొంగతనం
రాజధాని నగరంలోని నారాయణగూడలో పట్టపగలే ఓ అపార్ట్మెంట్లో చోరీకి జరిగింది. దొంగలు కిలో బంగారు నగలను లూటీ చేశారు.
దొంగతనం
నారాయణగూడ సీఐ ఎస్ .భీంరెడ్డి, డీఐ బి లక్ష్మినారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణగూడ - బర్కత్పుర రోడ్డులో రెడ్డి మహిళా కళాశాల ఎదురుగా ఉన్న వీధిలో శ్రీకృష్ణధామ్ అపార్ట్మెంట్ ఉంది. ఇందులోని రెండో అంతస్థులో ఉన్న 201 ఫ్లాట్లో ఆర్వీ జోషీ అనే ఫార్మా వ్యాపారి నివసిస్తున్నారు. వారు ఇంట్లో లేనప్పుడు ఈ చోరీ జరిగింది.
దొంగతనం
శనివారం ఉదయం జోషీ, అతని కుమారుడు వెంకటేష్ వ్యాపార విధులకు వెళ్లగా ఆయన భార్య మీరా జోషీ సమీపంలోని ఓ కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్లారు.
దొంగతనం
ఈ నేపథ్యంలో మధ్యాహ్నం అపార్ట్మెంట్లోకి ప్రవేశించిన ఇద్దరు ఆగంతకులు మూడో అంతస్థులో తమకు తెలిసినవారు ఉన్నారని వాచ్మెన్కు చెప్పి పైకి వెళ్లారు.
దొంగతనం
తాళం పగులగొట్టి ఫ్లాట్లోకి ప్రవేశించారు. బెడ్రూమ్ బీరువాలో ఉన్న కిలో బంగారు నగలను చోరీ చేసి వెళ్లిపోయారు. కాసేపటికి జోషీ ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది.
దొంగతనం
తమ ఇంట్లో చోరీ జరిగిన విషయం గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులు నారాయణగూడ పోలీసు స్టేషన్కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దొంగతనం
సంఘటనా స్థలానికి సెంట్రల్జోన్ డీసీపీ వీబీ కమలాసన్రెడి, సీసీఎస్(డీడీ) డీసీపీ పాల్రాజ్, అదనపు డీసీపీ వరప్రసాద్, ఆబిడ్స్ ఏసీపీ జయపాల్ చేరుకుని చోరీ జరిగిన తీరుపై వాచ్మెన్ నర్మింహులు ఆరా తీశారు.
దొంగతనం
క్లూస్టీమ్ను రప్పించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి ముందు దొంగలు ఇక్కడ రెక్కీ వేసి ఉండవచ్చని వారు అంచనా వేస్తున్నారు.