వ్యభిచారంలో బాలిక: తల్లి, బావ, అక్క అరెస్టు (ఫొటోలు)
హైదరాబాద్: ఓ బాలికను వ్యభిచారంలోకి దింపి చిత్రహింసలకు గురి చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె బావతో పాటు తల్లిని, సోదరిని హైదరాబాదులోని ఫలక్నుమా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వట్టేపల్లికి చెందిన మహ్మద్ అక్బర్ (42) మైనర్ అయిన తన మరదలితో ఏడాది నుంచి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం - అతనికి బాలిక తల్లి (48), సోదరి (28) సహకరిస్తూ వచ్చారు. వీరి చిత్రహింసల నుంచి బయటపడిన బాలిక ఈ నెల 18వ తేదీన పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. పాత నేరస్థుడైన అక్బర్ ఇప్పటి వరకు నలుగురిని వివాహం చేసుకున్నాడు. ఒక్కొక్కరికి ఇద్దరేసి సంతానం.
పెద్ద భార్య కూతురితో వ్యభిచారం చేయిస్తూ కాంట్రాక్ట్ పద్ధతిలో గతంలో ఒకే ఏడాదికి ఆరుగురు వ్యక్తులకు వివాహం చేశాడు. విషయం బయటకు పొక్కడంతో కంచన్బాగ్ పోలీసులు జైలుకు పంపించారు. జైలు నుంచి వచ్చిన తర్వాత వరుసకు అత్త అయ్యే మహిళను బలవంతంగా వ్యభిచారంలోకి దింపాడు.
ఈ క్రమంలో అక్బర్ కన్ను అయిన మరదలిపై పడింది. గత ఏడాది నుంచి బాలికను వ్యభిచారంలోకి దింపి సొమ్ము చేసుకుంటున్నాడు. ఇద్దరు మహిళా నిందితులను ఖుర్షీద్ బేగం, సుమయగా గర్తించారు. సుమయ అక్బర్కు నాలుగో భార్య.