బీ ఫారాలు తీసుకుంటు జయసుధ, ఇతరులు(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు శాసనసభ అభ్యర్థులకు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మంగళవారం బీ ఫారాలు ఇచ్చారు. తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేయడానికి బుధవారం చివరి రోజు. దీంతో అభ్యర్థులు బీ ఫారాలు తీసుకోవడానికి క్యూ కట్టారు.
సికింద్రాబాద్ నుంచి తిరిగి టికెట్ పొందిన జయసుధతో పాటు ఇతర అభ్యర్థులు బీ ఫారాలు అందుకున్నారు. బీ ఫారాలు తీసుకున్న తర్వాత వారు మీడియాతో కూడా మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసు గెలుపు ఖాయమని జయసుధ అన్నారు.
తెలంగాణకు 111 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెసు ఒకేసారి ప్రకటించింది. అయితే, మూడు స్థానాల్లో మాత్రం మార్పులు చేసింది. చివరి నిమిషంలో ముగ్గురు టికెట్లు కోల్పోయారు. కొత్తగా ముగ్గురు వచ్చారు.
జయసుధ ఇలా...
సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి తిరిగి టికెట్ పొందిన జయసుధ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసు గెలుస్తుందని అన్నారు.
దానం నాగేందర్ ఇలా...
ఖైరతాబాద్ శాసనసభా నియోజకవర్గం నుంటి పోటీ చేస్తున్న మాజీ మంత్రి దానం నాగేందర్ ఇలా కనిపించారు.
గండ్ర వెంకటరమణా రెడ్డి ఇలా..
వరంగల్ జిల్లా భూపాలపల్లి శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెసు అభ్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డి ఇలా కనిపించారు.
బీ ఫారం తీసుకుంటూ..
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నుంచి బీ ఫారం తీసుకుంటూ కాంగ్రెసు అభ్యర్థి ఒకరు ఇలా..
పొన్నాలతో జానా రెడ్డి...
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సీనియర్ కాంగ్రెసు నాయకుడు కె. జానారెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇలా..
చివరి నిమిషంలో..
చివరి నిమిషంలో కంటోన్మెంట్ శాసనసభా నియోజకవర్గం టికెట్ దక్కించుకున్న గజ్జెల కాంతం పొన్నాల నుంచి బీ ఫారం స్వకరిస్తూ ఇలా..
మల్లు భట్టి విక్రమార్క ఇలా..
ఖమ్మం జిల్లా మంథని శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ఇలా..
దుగ్యాల శ్రీనివాస రావు..
వరంగల్ జిల్లాలోని ఓ శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న దుగ్యాల శ్రీనివాసరావు బీ ఫారం అందుకుంటూ ఇలా..