తెలంగాణ, కాశ్మీర్పై వ్యాఖ్య: కవితపై ప్రయివేట్ ఫిర్యాదు
హైదరాబాద్: ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాశ్మీర్కు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పైన హైదరాబాదులో ఏడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రయివేటు పిటిషన్ దాఖలు అయింది.
స్వాతంత్ర్యానంతరం తెలంగాణ, జమ్ముకాశ్మీర్ రెండు వేర్వేరు రాష్ట్రాలను బలవంతంగా ఇండియన్ యూనియన్లో కలిపారని వ్యాఖ్యానించిన కవితపై ఐపీసీ సెక్షన్ 124(ఎ), 153(బి), 505ల కింద కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ లీగల్ సెల్ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ కాశింశెట్టి కరుణాసాగర్ ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఇంఛార్జ్ మెజిస్ర్టేట్ కేసు విచారణను ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా వేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల బంద్కు బీసీ సంక్షేమ సంఘ నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ పైన జాప్యాన్ని నిరసిస్తూ బంద్ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థుల జీవితాలలో ఆడుకోకుండా వెంటనే బోధనా రుసుమును చెల్లించాలని డిమాండ్ చేశారు.