వ్యభిచార నిర్వాహకులకు దేహశుద్ధి: ఢిల్లీ నుంచి వచ్చి
హైదరాబాద్: రాజధాని హైదరాబాదు నగరంలోని మైలార్దేవ్పల్లి లక్ష్మీగూడ దగ్గర వాంబే కాలనీలో వ్యభిచారం నిర్వహకులకు స్థానికులు దేహశుద్ధి చేశారు. ఢిల్లీ నుంచి వచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న దంపతులను అక్కడి స్థానికులు చితకబాది పోలలీససులకు అప్పగించారు.
మహబూబ్నగ జిల్లాలోని బిజినపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. నల్లగొండ సూర్యాపేటకు చెందిన 50 మంది వలస కూలీలు డీసీంలో సొంత ఊరికి వెళ్తూ మార్గమధ్యలో శాయినిపల్లి గ్రామంలో ఆగారు. అదే సమయంలో అటుగా వస్తున్న టాటాఏస్ వాహనం డీసీఎంను ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో పదిమందికి కాళ్లు, చేతులు విరిగాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులు రేపు జరిగే సమగ్ర సర్వేలో పాల్గొనడానికి సొంతజిల్లాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.