సదానందకు చంద్రబాబు కానుక: వినతులు(పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి రైల్వే స్టేషన్ను అత్యంత ఆధునికతతో అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ ప్రకటించారు. హైదరాబాద్లోని ఆర్పిఎఫ్ శిక్షణ కేంద్రంలో శుక్రవారం జరిగిన ఇన్స్పెక్టర్ల పాసింగ్ ఔట్ పరేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సదానందగౌడ ఇక్కడి లేక్వ్యూ అతిథిగృహంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.
రాష్ట్రంలోని రైల్వే అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రంలోని రైల్వే సమస్యలను వివరిస్తూ ఒక విజ్ఞాపన పత్రం అందించారు. ప్రఖ్యాత దేవాలయాలకు అనుసంధానంగా ఉన్న ఈ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. దీనికి సదానంద గౌడ కూడా సానుకూలంగా స్పందిస్తూ తిరుపతి స్టేషన్ అభివృద్ధికి సహకరిస్తామని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాష్ట్రం తరఫున అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామన్నారు. అవసరమైతే తిరుమల దేవస్థానం నుంచి నిధులను కూడా అందిస్తామని ప్రకటించారు. ఇతర ప్రాంతాల్లో రైలు మార్గాలు, కొత్త రైళ్ల ప్రారంభం, రైలు రవాణా వ్యవస్థ మెరుగుపర్చడం వంటి అనేక అంశాలపై చర్చించారు.
బాబు-సదానందగౌడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి రైల్వే స్టేషన్ను అత్యంత ఆధునికతతో అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ ప్రకటించారు.
బాబు-సదానందగౌడ
హైదరాబాద్లోని ఆర్పిఎఫ్ శిక్షణ కేంద్రంలో శుక్రవారం జరిగిన ఇన్స్పెక్టర్ల పాసింగ్ ఔట్ పరేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సదానందగౌడ ఇక్కడి లేక్వ్యూ అతిథిగృహంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.
బాబు-సదానందగౌడ
రాష్ట్రంలోని రైల్వే అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.
బాబు-సదానందగౌడ
ప్రఖ్యాత దేవాలయాలకు అనుసంధానంగా ఉన్న ఈ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని చంద్రబాబు గుర్తుచేశారు.
గౌడకు బాబు కానుక
దీనికి సదానంద గౌడ కూడా సానుకూలంగా స్పందిస్తూ తిరుపతి స్టేషన్ అభివృద్ధికి సహకరిస్తామని స్పష్టం చేశారు.
బాబు-సదానందగౌడ
ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రంలోని రైల్వే సమస్యలను వివరిస్తూ ఒక విజ్ఞాపన పత్రం అందించారు.
బాబు-సదానందగౌడ
ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాష్ట్రం తరఫున అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామన్నారు.