వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్క్లోలింగ్: స్పీకర్‌కు జగన్ సాక్షి టీవి క్షమాపణ

By Pratap
|
Google Oneindia TeluguNews

 Sakshi TV seeks apology from speaker
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద రావుకు క్షమాపణ చెప్పింది. లిఖితపూర్వకమైన క్షమాపణ పత్రాన్ని ఆ టీవీ చానెల్ ప్రతినిధులు స్పీకర్‌కు మంగళవారంనాడు అందించినట్లు సమాచారం

ఎపి శాసనసభా సమావేశాలు వచ్చేసారి విజయవాడలో జరుగుతాయని, ఇప్పుడు జరిగేవే హైదరాబాదులో ఆఖరి సమావేశాలని కోడెల శివప్రసాద రావు అన్నట్లు సాక్షి టీవీ స్క్రోలింగ్ ఇచ్చింది. వాస్తవానికి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని స్పీకర్ మీడియాతో ఇష్టాగోష్టిగా అన్నారు.

సాక్షి టీవీ స్క్రోలింగ్‌తో స్పీకర్ కార్యాలయానికి పెద్ద యెత్తున ఫోన్లు వచ్చాయి. దీంతో స్క్రోలింగ్ వ్యవహారంపై స్పీకర్ కార్యాలయం సాక్షి టీవీ యాజమాన్యానికి నిరసన తెలియజేసింది. దీంతో సాక్షి టీవీ ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పినట్లు సమాచారం.

పొరపాటుకు చింతిస్తున్నామని, సభా విలువల పట్ల తనకు గౌరవం ఉందని, ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తామని సాక్షి టీవీ ప్రతినిధులు లిఖితపూర్వకంగా స్పీకర్‌కు తెలియజేసినట్లు సమాచారం.

English summary
It is said that YSR Congress party president YS Jagan's Sakshi TV pleaded apology from Andhra Pradesh speaker Kodela Sivaprasad Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X