వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ యాగీ ఎందుకో, తండ్రి చేసింది ఎంత: సోమిరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Somireddy retaliates YS Jagan
హైదరాబాద్: రైతు రుణాల మాఫీపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు యాగీ చేస్తున్నారో అర్థం కావడం లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కేవలం ఆరు వేల కో్ట్ల పైచిలుకు రూపాయల రుణమాఫీ మాత్రమే చేశారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

రుణాలు చెల్లించిన రైతులకు వైయస్ రాజశేఖర రెడ్డి తిరిగి చెల్లించింది కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమేనని ఆయన అన్నారు. తమ తెలుగుదేశం ప్రభుత్వం అందరికీ రుణాలను మాఫీ చేస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇందుకు 40 వేల కోట్ల రూపాయలు భరించాల్సి వస్తుందని, ఇది తమ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైందని ఆయన అన్నారు.

తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన దానికి రెట్టింపు రుణమాఫీ చేసినా జగన్ హర్షించడా అని ఆయన అడిగారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఇంత రుణమాఫీ చేయలేదని ఆయన అన్నారు. దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని జగన్ పిలుపునివ్వడం దారుణమని ఆయన అన్నారు.

రైతు రుణాల మాఫీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా మూడు రోజుల పాటు నరకాసుర వధగా పరిగణించి దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

English summary
Telugudesam party president Nara Chandrababu Naidu retaliated YSR Congress party president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X