వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్రవంతిసహా 12మంది టి రెబల్స్‌‌పై కాంగ్రెస్ ఆరేళ్ల వేటు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Suspension on 12 T Congress leaders
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు రెబల్ అభ్యర్థుల పైన ఆ పార్టీ అధిష్టానం గురువారం వేటు వేసింది. టిక్కెట్ ఆశించి భంగపడిన పన్నెండు మంది అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. వారిలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తనయ స్రవంతి, నిజామాబాద్ జిల్లా మహిళా కాంగ్రెసు అధ్యక్షురాలు అరుణ తార తదితరులు ఉన్నారు. వారి పైన అధిష్టానం ఆరేళ్ల పాటు వేటు వేసింది.

వేటు పడింది వీరి పైనే...

అదిలాబాద్ - అమీనా ఖాన్
బెల్లంపల్లి - చిలుమోలు శంకర్
రామగుండం - కౌశిక్ హరినాథ్
హుజురాబాద్ - బీంరావు
యాకుత్ పుర - ఖాసీం ఖాన్
కోరుట్ల - నర్సింహరావు
మక్తల్ - సుగూరప్ప
కల్వకుర్తి - కాశిరెడ్డి నారాయణ రెడ్డి
ఇబ్రహీంపట్నం - మల్‌రెడ్డి రంగారెడ్డి
మునుగోడు - స్రవంతి
నిజామాబాద్ - అరుణతార

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తెరాసతోనే: విశ్వేశ్వర్ రెడ్డి

తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేవలం తెరాసతోనే సాధ్యమని చేవెళ్ల నియోజకవర్గ తెరాస అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపొతున్న ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. విశ్వేశ్వర్‌రెడ్డి గ్రామగ్రామాన పర్యటిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.

English summary
Suspension on Twelve Telangana Congress leaders on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X