కెసిఆర్, జగన్లకు షాక్: మోడీ, చంద్రబాబులదే హవా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర, తెలంగాణ)లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి హవా ఉండనుందట. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎపిలోని 42 లోకసభ స్థానాల్లో 17-21 స్థానాలు బిజెపి-టిడిపి కూటమికి రానున్నాయట. ప్రముఖ హిందీ ఛానల్ ఆజ్ తక్ సర్వేలో ఇది తేలింది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 7-11, తెలంగాణ రాష్ట్ర సమితి 6-10, కాంగ్రెసు పార్టీ 4-6 సీట్లు గెలుచుకోనున్నాయని ఆ సర్వేలో తేలింది. గత కొంతకాలంగా టిడిపి, బిజెపి కూటమికి బలం నానాటికి పెరుగుతున్నట్లు జాతీయ టీవి ఛానళ్ల సర్వేలలో తేలుతోంది. ఇప్పుడు ఆజ్ తక్లోను బిజెపి, టిడిపి కూటమి ముందంటలో ఉంది.
సిసిరోతో కలిసి ఈ సర్వేను నిర్వహించారు. టిడిపి, బిజెపి కూటమి 37 శాతం ఓట్లు సాధించనున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 24 శాతం ఓట్లతో 7-11 సీట్లు గెలుచుకోనుంది. తమిళనాడులో బిజెపి కూటమికి నాలుగు నుండి ఆరు స్థానాలు వస్తాయి. తొలి స్థానంలో అన్నాడిఎంకె పార్టీ ఉంది.