దారుణం: హత్య చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించారు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని మంచంపట్టి మండలం పోలిపుట్టు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న 80 కిలోల గంజాయిను పట్టుకున్నారు. ముగ్గిరిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఓ బొలెరో వాహనం, ద్విచక్రవాహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
గుంటూరు జిల్లా చిలకలూరి పేట నుంచి తూర్పుగోదావరి జిల్లా మండపేటకు అక్రమంగా తరలిస్తున్న 113 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు దాడి చేసి సోమవారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే... ముందుగా అందిన సమాచారం మేరకు సిటీలోని చెరువు రోడ్డులో రేషన్ బియ్యాన్ని ఒక పెద్ద లారీ, మినీ లారీల్లో తరలిస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు.
ఆ తర్వాత బియ్యాన్ని స్వాధీనం చేసుకోని, లారీలతో సహా సిటీ పోలీస్ స్టేషన్కు తరలించారు.
అనంతపురంలో దారుణం
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మాలగిరిపల్లలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని దుండగులు హత్య చేసి అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు.