కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నగల షాపులో 3గురు అనుమానాస్పద మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

కడప: కడప జిల్లాలోని ఓ నగల దుకాణంలో ముగ్గురు సిబ్బంది అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని తళ్లెం నగల దుకాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

గురువారం ఉదయం దుకాణం తెరిచిన సిబ్బందికి ముగ్గురు మరణించి ఉండడాన్ని గమనించారు. వారు పొగ వల్ల ఊపిరి ఆడక చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే, ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 Three found dead in Jewellery shop at Prodduturu

సంఘటనపై యాజమాన్యం కూడా పెదవి విప్పడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీకి ప్రయత్నం జరిగిందా, లేదా మరేమైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary

 Three dead bodies have been found inside the jewellery shop at Prodduturu in Kadapa district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X