దారుణం: మహిళలను వివస్త్రలను చేసి చిత్రహింసలు
వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 7న కొన్యాల గ్రామంలో బడంపేట నర్సింహులు(40) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నిందితులైన చాకలి అశోక్, ఆగమయ్యను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా, వారు ఇటీవల బెయిల్పై విడుదలయ్యారు. హతుడు నర్సింహులు కుటుంబం నుంచి ముప్పు ఉండటంతో గ్రామానికి రాకుండా దూరంగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో అశోక్ బంధువులైన ఇద్దరు మహిళలపై నర్సింహులు కుటుంబసభ్యులు జులై 12న సాయంత్రం 6గంటల సమయంలో దాడి చేశారు. వారిని ఇంట్లోంచి లాక్కొచ్చి గ్రామంలోని పోచమ్మ గుడి వద్ద పైపులకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు. చిత్రహింసలకు గురి చేశారు. బాధిత మహిళలు దాహం వేస్తుందని అడిగితే వారి నోట్లో మూత్రం పోశారు.
ఆ తర్వాత వారిని వివస్త్రలను చేసి.. జుట్టు కత్తిరించారు. కాగా, ఈ దుర్మార్గాన్ని గ్రామస్తులెవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. బాధిత మహిళలను ఆస్పత్రికి కూడా తీసుకెళ్లనివ్వలేదు. ఆగస్టు 13న బాధిత మహిళలు జిల్లా ఎస్పీని ఆశ్రయించి జరిగిన విషయాన్ని తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు. దీంతో స్థానిక పోలీసులను కేసు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.