అసదుద్దీన్ రోడ్షో: జయసుధకు గులాబీ(పిక్చర్స్)
హైదరాబాద్: ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు. శుక్రవారం వివిధ పార్టీల తరపున నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరపున కేంద్రమంత్రి జైరాం రమేష్ చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ లోకసభ అభ్యర్థి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు.
ఎంఐఎం పార్టీ అధినేత, పార్లమెంటు అసదుద్దీన్ ఓవైసీ, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తమ పార్టీ అభ్యర్థుల తరపున జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జయసుధ కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటి ప్రచారం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి మల్కాజ్గిరి లోకసభ అభ్యర్థి మైనంపల్లి కూడా ప్రచారాన్ని ఉధృతం చేశారు.
జైరాం ప్రచారం
కాంగ్రెస్ పార్టీ తరపున కేంద్రమంత్రి జైరాం రమేష్ చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ లోకసభ అభ్యర్థి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు.
ఓవైసీ ఇంటింటి ప్రచారం..
ఎంఐఎం పార్టీ అధినేత, పార్లమెంటు అసదుద్దీన్ ఓవైసీ, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
చిన్నారులతో..
ప్రచారంలో భాగంగా చిన్నారులతో ముచ్చటిస్తున్న పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ.
అక్బర్కు పూల
ప్రచారం నిర్వహిస్తూ ఓ ఇంటికి వెళ్లగా అక్బరుద్దీన్ ఓవైసీకి పూల మాల వేస్తున్న ఓ మహిళ.
అక్బర్ రోడ్షో
ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్షోలో మాట్లాడుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ.
టిడిపి-బిజెపి జెండాలతో..
తెలుగుదేశం పార్టీ-భారతీయ జనతా పార్టీల పొత్తుల నేపథ్యంలో రెండు పార్టీలో జెండాలతో మహిళలు.
టిడిపి-బిజెపి ప్రచారం
భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తమ పార్టీ అభ్యర్థుల తరపున జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
స్వతంత్ర అభ్యర్థి
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఉప్పల్ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి పవిత్ర.
టిఆర్ఎస్ ప్రచారం..
తెలంగాణ రాష్ట్ర సమితి మల్కాజ్గిరి లోకసభ అభ్యర్థి మైనంపల్లి కూడా ప్రచారాన్ని ఉధృతం చేశారు.
ఇస్త్రీ కూడా చేస్తా...
కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇస్త్రీ చేస్తున్న అంజన్.
బిజెపి ప్రచారం..
సికింద్రాబాద్ బిజెపి ఎంపి అభ్యర్థి బండారు దత్తాత్రేయ తరపున ప్రచారం నిర్వహిస్తున్న బిజెపి నాయకులు.
ఓటు అభ్యర్థిస్తున్న దానం
ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, అభ్యర్థి దానం నాగేందర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటు అభ్యర్థిస్తున్న దృశ్యం.
జయసుధ ప్రచారం
సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, అభ్యర్థి జయసుధ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు.
జయసుధకు గులాబీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ వద్దకు వచ్చిన అభిమాన నటి జయసుధకు గులాబీ పువ్వు ఇచ్చిన మహిళలు.