గూగుల్ ఇండియా సహా ఒప్పందాలు, బాబుకు కితాబు
విశాఖ: ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో జరుగుతున్న ఐటీసీఈవోల సదస్సులో రాష్ట్ర ప్రభుత్వానికి గూగుల్ ఇండియా, విప్రో, టెక్ మహీంద్రా, సమీర్ తదితర సంస్థలతో కీలక ఒప్పందాలు జరిగాయి. 400 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సుకు ఏపీ సీం చంద్రబాబు నాయుడు, ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు గోపాలకృష్ణన్ తదితరులు హాజరయ్యారు.
మధురవాడ ఐటీ ఇంక్యూబేషన్ సెంటర్ అభివృద్ధికి అవగాహన ఒప్పందం, మధురవాడ ఐటీ సెంటర్ అభివృద్ధికి మాబ్ ఎంఈ/స్టార్ట్ అప్ విలేజ్తో ఒప్పందం, చిరు వ్యాపారులు, మహిళలకు ఇంటర్నెట్ ద్వారా లబ్ధి పొందేందుకు గూగుల్ ఇండియా సాయం, డిజిటల్ ఏపీ ప్రాజెక్టులో భాగంగా గూగుల్ ఇండియాతో అవగాహన ఒప్పందం జరిగాయి.
విశాఖ ఓ ఐకాన్గా నిలుస్తుంది: గోపాలకృష్ణన్
మేడిన్ ఇండియా, మేడిన్ ఏపీలో విశాఖ ఓ ఐకాన్లా నిలుస్తుందని ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు గోపాలకృష్ణన్ అన్నారు. ఐటీని ఉపయోగించుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించవచ్చునని తెలిపారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు పాలన అద్భుతంగా ఉందని, ఇప్పుడు కూడా బాబు విజయవంతమైన పాలన అందిస్తారన్నారు.