అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్త కళ్లు తీసేసిన భార్య
తన ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్ పనికోసం గోపాల్రెడ్డి రాఘవేంద్ర ఇంటికొచ్చేవాడు. ఈ క్రమంలో అతనితో సరితకు వివాహేతర సంబంధం ఏర్పడింది. రాఘవేంద్రకు విషయం తెలియడంతో ఇద్దరినీ మందలించాడు తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడన్న కోపంతో 2012 డిసెంబరులో నిద్రిస్తున్న రాఘవేంద్ర ముఖంపై గోపాల్రెడ్డి, సరిత కలసి మత్తుమందు చల్లారు.
అతని కళ్లల్లో జిల్లెడు పాలు పోశారు. దాంతో రాఘవేంద్ర అంధుడయ్యాడు. విషయం పోలీసులకు చెబితే కూతుర్ని చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడటంతో రాఘవేంద్ర అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సరిత పిల్లలతో కలిసి వెళ్లి గోపాల్రెడ్డి వద్దే ఉంటుంది.
తాను చేసిన ఇంటీరియర్ డెకరేషన్ పనికి డబ్బు ఇవ్వాలని రాఘవేంద్ర ఇటీవల గోపాల్రెడ్డిని అడిగాడు. డబ్బు ఇవ్వకపోగా వేధించాడు. దాంతో ఈ నెల 11న రాఘవేంద్ర ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోపాల్రెడ్డి, సరితలను అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు తరలించారు.