హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళా టీసీపై దాడి: వేధింపు, పిలిచి చితకబాదిన గర్ల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Woman TC thrown out of train
హైదరాబాద్: బేగంపేట దగ్గర ఎంఎంటీఎస్ రైలులో టికెట్ కలెక్టర్ (టీసీ) కౌసల్యపై దుండగులు దాడి చేశారు. టికెట్ అడిగినందుకు టీసీపై దుండగులు దాడికి పాల్పడ్డారు. టీసీ ఫిర్యాదు మేరకు బేగంపేట రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దుండగులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

తీవ్రంగా గాయపడిన కౌసల్యను లాలాపేట ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల్లో మహిళా టీసీపై దాడి జరగడం రెండో సారి. కాగా, ఎంఎంటీఎస్‌లో తమకు రక్షణ కరువైందని మహిళా టీసీలు ఆందోళన వ్యక్తం చేశారు.

వేధిస్తున్న వ్యక్తిని కొట్టిన యువతి

ఫోన్‌లో వేధిస్తున్న వ్యక్తికి ఓ యువతి బుద్ధి చెప్పింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ షాపింగ్ మాల్‌లో పని చేస్తున్న ఓ యువతిని సత్యనారాయణ అనే వ్యక్తి వేధింపులకు గురి చేశాడు. దీంతో విసిగిపోయిన యువతి సత్యనారాయణను షాపింగ్‌మాల్‌కు పిలిపించి దేహశుద్ధి చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు.

బంగారం పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు భారీగా బంగారం పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల వద్ద నుండి ఐదు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం స్మగ్లింగ్ చేస్తున్న తొమ్మిది మంది మహిళలను, వారికి బంగారం ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఉమ్రా నుండి వారు బంగారం తీసుకు వచ్చారు.

English summary
Woman Ticket Collector thrown out of train in Hyderabad on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X