మహిళా టెక్కీ అదృశ్యం: అమ్మాయిని మోసం చేసి..
సోమవారం ఉదయం 8గంటల ప్రాంతంలో ఇంటి నుంచి వెళ్లిన ఆమె.. రాత్రయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన భర్త చైతన్య మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. మాదాపూర్ పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అమ్మాయిని మోసం చేసి..
ఓ అమ్మాయిని మోసగించి పెళ్లాడిన వ్యక్తిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మెదక్ జిల్లా ముత్తయ్యపల్లికి చెందిన మేస్త్రి కృష్ణ ఎన్టీఆర్ గార్డెన్ వెనుక వైపున ఉన్న గుడిసెలో నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడే ఉండే ఓ అమ్మాయి ఇతనికి పరిచయమైంది.
గతంలోనే వివాహమైన కృష్ణ, ఆ విషయాన్ని చెప్పకుండా అమ్మాయిని మోసగించి ఆగస్టు 2న తన ఇంటికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. బాచుపల్లిలోని ఓ ఇంట్లో ఉంచి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయి బంధువుల ఫిర్యాదుతో కృష్ణపై కేసు నమోదు చేశారు.