మహిళ గొంతు కోశారు, నగలు మర్చిపోయిన గోవా స్త్రీ
హైదరాబాద్: హైదరాబాద్ కూకట్పల్లిలోని వివేకానందనగర్ బస్స్టాప్లో ఆదివారం ఉదయం దారుణ సంఘటన జరిగింది. బస్స్టాప్లో నిలుచుని ఉన్న గుర్తు తెలియని మహిళపై దుండగులు దాడి చేశారు. అనంతరం ఆమె గొంతుకోసి హత్య చేశారు. దాంతో ఆమె రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచింది.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటోలో నగలు మర్చిపోయిన గోవా మహిళ
గోవా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ హైదరాబాదులో ప్రయాణిస్తూ రూ.3 లక్షల విలువ గల నగలను ఆటోలో మర్చిపోయింది. ఆమె హుమాయున్ నగర్ పోలీసు స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేసింది.
రియాల్టర్ ఇంట్లో చోరీ
హైదరాబాదులోని సైదాబాదులో ఓ రియాల్టర్ ఇంట్లో చోరీ జరిగింది. పట్టపగలే ఈ చోరీ జరిగింది. ఇంట్లోని నగదు, బంగారం దోచుకెళ్లారు. ఇంటికి ఉన్న తాళాలు పగులగొట్టి వీటిని దొంగిలించారు.