వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇడుపులపాయలో జగన్: వైయస్‌కు ఘన నివాళి

|
Google Oneindia TeluguNews

కడప: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 65 జయంతి సందర్భంగా ఇడుపులపాయలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. జగన్ తోపాటు వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైయస్ విజయమ్మ, కుమార్తె షర్మిల, ఇతర కుటుంబసభ్యులు పాల్గొని ఘన నివాళులర్పించారు.

అనంతరం అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైయస్ జగన్ మామ ఈసి గంగిరెడ్డి, కడప ఎంపి వైయస్ అవినాష్ రెడ్డి, బంధువులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైయస్ స్మృతి వనానికి చేరుకుని నివాళులర్పించారు.

YS Jagan pays tributes to YSR on his 65th birth anniversary

చిత్తూరు, అనంతపురం తదితర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులకు పండ్లు పంచిపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో వైయస్ జయంతిని ఘనం నిర్వహించారు.

English summary

 YSR Congress party president Y S Jagan Mohan Reddy on Tuesday paid floral tribute to his father and late chief minister Y.S. Rajasekhara Reddy on his 65th birth aniverssary at his "samadhi" Idupulapaya,Kadapa district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X