కొట్టుకుపోయే రోజు: బాబుపై జగన్, మనవైపే (పిక్చర్స్)
అనంతపురం: ప్రజావ్యతిరేకతతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొట్టుకుపోయే రోజు దగ్గరలోనే ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రెండేళ్లలో రావాల్సిన ప్రజావ్యతిరేకత రెండు నెలల్లోనే వచ్చిందని తెలిపారు. ఆయన అనంతపురం జిల్లాలో నిర్వహించిన పార్టీ సమీక్షా సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడారు.
తెలుగుదేశం ప్రభుత్వానికి దేవుడు మొట్టికాయ వేసే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. తీవ్ర సమస్యలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని జగన్ విమర్శించారు. రుణమాఫీ కోసం ఇప్పటివరకు పైసా విదల్చలేదని ఆరోపించారు. అబద్ధాలు, మోసాలతో చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.
హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. రుణమాఫీ కోసం అక్టోబర్ 16న చేపట్టనున్న మండల కార్యాలయాలయ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జగన్ పిలుపునిచ్చారు. టిడిపి నేతల దౌర్జన్యాలపై ఎప్పటికప్పుడు స్పపిలపుకి అండగా ఉద్యమించాలని అన్నారు.
వైయస్ జగన్
ప్రజావ్యతిరేకతతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొట్టుకుపోయే రోజు దగ్గరలోనే ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
వైయస్ జగన్
చంద్రబాబు ప్రభుత్వంపై రెండేళ్లలో రావాల్సిన ప్రజావ్యతిరేకత రెండు నెలల్లోనే వచ్చిందని తెలిపారు.
వైయస్ జగన్
వైయస్ జగన్ అనంతపురం జిల్లాలో నిర్వహించిన పార్టీ సమీక్షా సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వానికి దేవుడు మొట్టికాయ వేసే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు.
వైయస్ జగన్
తీవ్ర సమస్యలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని జగన్ విమర్శించారు. రుణమాఫీ కోసం ఇప్పటివరకు పైసా విదల్చలేదని ఆరోపించారు.