ఆకృత్యాలు పెరిగాయి: లొంగిపోయన 16మంది మావోలు
కేర్లపాల్ ప్రాంతం కమిటీకి చెందిన 14 మంది నిషేధిత సిపిఐ (మావో)కు చెందిన సుక్మా జిల్లా రిజర్వ్ పోలీసు బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో లొంగిపోయారు. ఈ విషయాన్ని బెటాలియన్ కమాండెంట్ వివిఎన్ ప్రసన్న గురువారం తెలిపారు.
కవాసీ బండి(25), జితేందర్ (19), ముసాకీ హిడ్మా(35), భీమ(25), సోమ (44), మడ్కం దేవ (35), సోడి సింగన్ (28) స్థానిక ఆపరేషన్ స్క్వాడ్లో పనిచేస్తున్నారు. కింద స్థాయి కేడర్ను దోపిడీ చేయడం, మహిళ కార్యకర్తలపై ఆకృత్యాలు పెరగడంతో వారు లొంగిపోతున్నట్టు తెలిపారు.
గిరిజన యువతను భయపెట్టి ఉద్యమంలోకి తీసుకొచ్చి, తరువాత సిద్ధాంతాలకు తిలోదకాలు ఇస్తున్నారని ప్రసన్న స్పష్టం చేశారు. అలాగే బీజపూర్ జిల్లాలో ఓ బాలిక సహా ఇద్దరు నక్సల్స్ లొంగిపోయారు. సరిత అలియాస్ స్వరూప కుడియం (17), మున్నా పడం (23) బీజపూర్ కలెక్టర్ అబ్దుల్ ఖైసర్ హక్, ఎస్పీ కెఎల్ ధృవ్ ఎదుటు లొంగిపోయారు.