బస్సు ప్రమాదం: 21 మంది మృతి, 9మందికి గాయాలు
ఈ ప్రమాదంలో సిమ్లా జిల్లాలో చోటు చేసుకుంది. సహాయక చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. సిమ్లా నుంచి సవేరాఖడ్కు వెళుతుండగా బసంత్పూర్ ప్రాంతంలోని కాధర్ ఘాట్ వద్ద బస్సు లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు చేపట్టినట్లు సిమ్లా ఎస్పి డిడబ్ల్యూ నేగి తెలిపారు.
సుమారు 400 మీటర్ల లోతు గల లోయలో బస్సు పడటంతో ఎక్కువ మంది ప్రయాణికులు మృతి చెందారని ఆయన తెలిపారు. ఈ ప్రమాదం సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో జరిగిందని చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనను ముందే పసిగట్టిన బస్సు డ్రైవర్ ముందే దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు.
గాయాలపాలైన ప్రయాణికులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంపై హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ జిల్లా అధికారులతో మాట్లాడారు. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగానే బస్సు అదుపుతప్పి లోయలో పడినట్లు భావిస్తున్నారు.