వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కదులుతున్న కారులో యువతిపై మిత్రులు గ్యాంగ్ రేప్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 23 ఏళ్ల వయస్సు గల యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమె మిత్రుడితో పాటు అతని మిత్రులు ఇద్దురు కదులుతున్న కారులో ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన దక్షిణ ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ ఏరియాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

బాధితురాలు ఓ మహిళా కానిస్టేబుల్ కూతురు అని, కూల్ డ్రింక్‌లో మంత్రు పదార్థాలు కలిపి ఇచ్చారని, దాన్ని సేవించిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయిందని, ఆ స్థితిలో ఆమెపై సామూహిక అత్యాచారం చేసి నెహ్రూ ఫ్లైఓవర్ వద్ద వదిలి వెళ్లారని పోలీసులు తెలిపారు.

23-year-old girl gangraped by friends in moving car

అపస్మారక స్థితిలో ఉన్న యువతిని గమనించిన ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. యువతి సామూహిక అత్యాచారానికి గురైనట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అమ్మాయి తన మిత్రుడు, అతని మిత్రుడితో పాటు కారులో బయలుదేరిందని, మార్గమధ్యంలో ఆమెకు మత్తు పదార్థాలు కలిపిన శీతల పానీయం ఇ్చచారని, అది తాగిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయిందని పోలీసులు వివరించారు.

ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.

English summary
A 23-year-old girl was allegedly gang-raped by her male friend and two of his friends in a moving car before being dumped by the roadside near Nehru Place area of South Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X