మరో స్త్రీతో అపైర్: డ్రైవర్తో కలిసి భార్యను చంపిన భర్త
మరో మహిళతో సంబంధం పెట్టుకుని భార్యను అతను హత్య చేసినట్లు కాన్పూర్ జోన్ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ అశుతోష్ పాండే చెప్పారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
జ్యోతి శరీరంపై పలు గాయాలున్నాయి. ఆమె శవం జులై 28వ తేదీన జిల్లాలోని పాంకీ ప్రాంతంలో పియూష్ కారులో కనిపించింది. సంఘటన జరిగిన తర్వాత పియూష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను తన భార్య జ్యోతితో కలిసి రెస్టారెంట్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా 27వ తేదీ రాత్రి మోటార్ సైకిల్పై వచ్చిన యువకులు కారును దాటేయడానికి ప్రయత్నించారని అతను తన ఫిర్యాదులో చెప్పాడు.
బైక్ కారును ఢీకొనడంతో తనకూ యువకులకూ మధ్య ఘర్షణ జరిగిందని, ఓ యువకుడు తనను కొట్టాడని, జ్యోతిని తీసుకుని కారులో యువకులు వెళ్లిపోయారని చెప్పాడు. అతను చెప్పిన విషయాల్లో పొంతన లేకపోవడంతో మొదటి నుంచీ పియూష్ను అనుమానిస్తూనే ఉన్నామని పోలీసులు చెప్పారు.
తనను కొట్టారని పియూష్ చెప్పాడని, అయితే అతని శరీరంపై ఎలాంటి గాయాలూ లేవని, సంఘటనా స్థలం నుంచి ఫోన్ చేయాడనికి వీలున్నా గంట తర్వాత తమకు ఫిర్యాదు చేశాడని పోలీసులు అంటున్నారు.
జ్యోతి మృతదేహంపై కూడా ఏ విధమైన గాయాలు లేవు. కారుకు ఏ విధమైన నష్టం జరగలేదు. ఈ కారణాలన్నింటితో పియూష్ను అనుమానించాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు.