మహిళ నుంచి కోటి 30లక్షలు కాజేసిన ఫేస్బుక్ ఫ్రెండ్
ఆ పరిచయం పెరిగి ఫోన్లో చాటింగ్ చేసేంత వరకు వెళ్లింది. రిచర్డ్ అండర్సన్గా తనను తాను పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి.. భారతదేశంలో ఏదైనా సేవా కార్యక్రమం చేయాలని ఉందని చెప్పాడు. అందుకోసం ఆమె నుంచి సలహాలు కూడా తీసుకున్నాడు. ఇద్దరూ బాగా చర్చించుకుని చివరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్లో ఓ వృద్ధాశ్రమం నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం రూ. 9 కోట్లు పంపిస్తానని అతడు చెప్పాడు.
కొద్ది రోజులకే బీనాకు మరో వ్యక్తి ఫోన్ చేసి తాను రిజర్వు బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజ్ శాఖ నుంచి మాట్లాడుతున్నానని చెప్పి.. మీరు కొంత మొత్తం టాక్స్ కడితే రూ. 9 కోట్లు తీసుకోవచ్చని ఆమెకు తెలిపాడు. ఆ మాటలు నమ్మిన బీనా ఆ వ్యక్తి చెప్పిన మొత్తం 25 ఖాతాలకు రూ. కోటి 30 లక్షల రూపాయలను తన ఖాతా నుంచి బదిలీ చేసింది.
కాగా, తనకి రూ. 9 కోట్ల డబ్బు అందకపోవడం, రిచర్డ్ నుంచి ఫోన్ రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బీనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీనా డబ్బు బదిలీ చేసిన ఖాతాలను తనిఖీ చేసి చూస్తే అవి కేరళ, తమిళనాడు, కర్ణాటకలకు చెందినవిగా తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఖాతాల ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తామని పోలీసులు తెలిపారు.