మోడీపై ఒమర్, బిక్కుమంటూ బాధితులు (పిక్చర్స్)
న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమైన జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఆదుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అందించిన సహకారం మరచిపోలేనిదని అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా వెల్లడించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి తాము సంతోషంగా ఉన్నట్లు క్యాబినెట్ సమావేశం అనంతరం పై విధంగా స్పందించారు.
వరదల కారణంగా సుమారు 200 మంది చనిపోయారని, సివిల్ సెక్రటేరియట్లో గురువారం నుండి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తన కార్యక్రమాలను ప్రారంభిస్తుందని అన్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు... ఇలా, కాశ్మీర్ ప్రజలకు సాయపడుతున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
గత 60 ఏళ్లలో ఇంతటి భయంకరమైన వరదలను తామెన్నడూ చూడలేదని అన్నారు. ప్రభుత్వానికి చెందిన ఉన్నాతధికారులు కూడా ఈ వరదల్లో చిక్కుకుపోయారని తెలిపారు. వరద సహాయ కేంద్రాలైన బారాముల్లా, సనత్ నగర్, రాజ్ భాగ్, జవహర్ నగర్, గోగ్జిభాగ్, ఇక్రాజ్ పుర తదితర ప్రాంతాల్లో నిలిచిపోయిన వరదనీటిని భారీ యాంత్రాలతో తోలగిస్తున్నామన్నారు.
శ్రీనగర్ - బారాముల్లా మార్గాల్లో రైళ్ల రాకపోకలను పాక్షికంగా పునరుద్దరించారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను ఇప్పటి వరకు 2.4 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 80 వరకు సరుకు రవాణా విమానాలు, హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ బలగాలు 19 పునరావాస కేంద్రాలను నెలకొల్పాయి.
జమ్మూ కాశ్మీర్ వరదబాధితులను రక్షించి పునరావాసం కల్పించే విషయంలో కేవలం శ్రీనగర్ పైనే దృష్టిని పరిమితం చేయకుండా ఇతర జిల్లాలపైనా దృష్టి సారించాలని సుప్రీం కోర్టు ధర్మాసనం జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి సూచించింది.
వరదల్లో మోడీ సహకారం మరవలేనిది: ఓమర్ అబ్దుల్లా
వర్షాలతో అతలాకుతలమైన జమ్ము కశ్మీర్లో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. ఇప్పటివరకు 2.26 లక్షల మందిని సహాయ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించినా ఇంకా లక్షల మంది సాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
వరదల్లో మోడీ సహకారం మరవలేనిది: ఓమర్ అబ్దుల్లా
గత 60 ఏళ్లలో ఇంతటి భయంకరమైన వరదలను తామెన్నడూ చూడలేదని అన్నారు. నిత్యావసర సరుకులు, మంచినీరు, మందులు అందక అల్లాడిపోతున్నారు.
వరదల్లో మోడీ సహకారం మరవలేనిది: ఓమర్ అబ్దుల్లా
వరద బాధితులకు అవసరమైన సాయం తక్షణమే అందించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. వరదలు తగ్గుముఖం పట్టడంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ఇప్పటివరకు 2.26 లక్షల మందిని ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు రక్షణశాఖ అధికార ప్రతినిధి కల్నల్ ఎస్డీ గోస్వామి తెలిపారు.
వరదల్లో మోడీ సహకారం మరవలేనిది: ఓమర్ అబ్దుల్లా
ఇప్పటివరకు 2.26 లక్షల మందిని ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు రక్షణశాఖ అధికార ప్రతినిధి కల్నల్ ఎస్డీ గోస్వామి తెలిపారు.
వరదల్లో మోడీ సహకారం మరవలేనిది: ఓమర్ అబ్దుల్లా
కొన్ని
ప్రాంతాల్లో
ప్రజలకు
ఇప్పటికీ
నిత్యావసర
వస్తువులు,
మందులు
అందడంలేదు.
80
వరకు
సరుకు
రవాణా
విమానాలు,
హెలికాప్టర్లు
సహాయక
చర్యల్లో
పాల్గొన్నట్లు
పేర్కొన్నారు.
జమ్మూ
కాశ్మీర్లో
ఆర్మీ
బలగాలు
19
పునరావాస
కేంద్రాలను
నెలకొల్పాయి.
వరదల్లో మోడీ సహకారం మరవలేనిది: ఓమర్ అబ్దుల్లా
వరద బాధితులను ఆదుకోవాలని ఒరిస్సా తీరంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన పట్నాయక్ నిర్మించిన చిత్రం.
వరదల్లో మోడీ సహకారం మరవలేనిది: ఓమర్ అబ్దుల్లా
జమ్మూ కాశ్మీర్ వరదబాధితులను రక్షించి పునరావాసం కల్పించే విషయంలో కేవలం శ్రీనగర్ పైనే దృష్టిని పరిమితం చేయకుండా ఇతర జిల్లాలపైనా దృష్టి సారించాలని సుప్రీం కోర్టు ధర్మాసనం జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి సూచించింది.
వరదల్లో మోడీ సహకారం మరవలేనిది: ఓమర్ అబ్దుల్లా
భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమైన జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఆదుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అందించిన సహకారం మరచిపోలేనిదని అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓమర్ అబ్దు్ల్లా వెల్లడించారు.
వరదల్లో మోడీ సహకారం మరవలేనిది: ఓమర్ అబ్దుల్లా
తీవ్రమైన వరదలు కశ్మీర్లో బీభత్సం సృష్టించాయని, సహాయ చర్యలను పర్యవేక్షించేం దుకు ఓ యూనిఫైడ్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని బెంచ్ సూచించింది.
వరదల్లో మోడీ సహకారం మరవలేనిది: ఓమర్ అబ్దుల్లా
వరద సహాయ కేంద్రాలైన బారాముల్లా, సనత్ నగర్, రాజ్ భాగ్, జవహర్ నగర్, గోగ్జిభాగ్, ఇక్రాజ్ పుర తదితర ప్రాంతాల్లో నిలిచిపోయిన వరదనీటిని భారీ యాంత్రాలతో తోలగిస్తున్నామన్నారు.