శ్వేతాబసునే ఎందుకు, ఆ పేర్లేవి?: టీవీ సీరియల్ తల్లి
ముంబై: వ్యభిచారం కేసులో పట్టుబడిన టాలీవుడ్ నటి శ్వేతాబసును ఎక్కువగా ఎందుకు ఫోకస్ చేస్తున్నారని టీవీ నటి సాక్షి తన్వర్ ప్రశ్నించినట్లుగా వార్తలు వస్తున్నాయి. శ్వేతాబసుకు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు లేదా? అని ప్రశ్నించారని సమాచారం. మీడియాలో ఎందుకు ఫోకస్ చేస్తున్నారని ప్రశ్నించారని తెలుస్తోంది.
13 ఏళ్ళ క్రితం వచ్చిన 'కహానీ ఘర్ ఘర్ కీ' టీవీ సీరియల్లో ఈ టీవీ నటి సాక్షి.. శ్వేతాబసుకు తల్లిగా నటించింది. తాజాగా, వ్యభిచారం కేసులో శ్వేతాబసు పేరు మీడియాలో మార్మోగిపోతుండడం పట్ల సాక్షి స్పందించిందని వార్తలు వస్తున్నాయి.
శ్వేతాబసు పేరు మాత్రమే మీడియాలో వస్తోందని, కానీ, ఈ వ్యవహారంలో ఉన్న వ్యాపారవేత్తల పేర్లు మాత్రం బయటికి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు మాత్రం గౌరవమర్యాదలుండవా, వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదా అన్ని ప్రశ్నించారు. శ్వేతాబసు తనతోపాటు సీరియల్లో నటించినప్పుడు తొమ్మిదేళ్ల అమ్మాయి అని, ఎంతో ప్రతిభావంతురాలని సాక్షి ప్రశంసించింది.
శ్వేతాబసునే ఫోకస్ చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. శ్వేతాబసు సమస్యల, ఆమె అందులోకి వెళ్లడానికి గల కారణాలు తనకు అవసరం లేదని, ఆమెకు సొల్యూషన్ చెప్పేందుకు కూడా తన వద్ద ఏమీ లేదన్నారు. ఒకవేళ ఆమె స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే.. ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలని అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. ఆమె గురించి ఎవరికి, ఎంతగా తెలుసునని ప్రశ్నించారు.
శ్వేతాబసు - సాక్షి
టాలీవుడ్ నటి శ్వేతాబసు వ్యవహారం పైన ఇప్పటికే పలువురు సినిమా ప్రముఖులు జాలి చూపిన విషయం తెలిసిందే. శ్వేతాబసు పైన మీడియా అధిక ఫోకస్ చేస్తోందని తాజాగా ఆమెకు సీరియల్లో తల్లిగా నటించిన సాక్షి విమర్శించింది.
శ్వేతాబసు - సాక్షి
శ్వేతాబసు కొద్ది రోజుల క్రితం వ్యభిచారం కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం హైదరాబాదులోని ఓ రెస్క్యూ హోంలో ఉన్నారు.
శ్వేతాబసు - సాక్షి
శ్వేతాబసు వ్యభిచారం కేసు వ్యవహారంలో.. కేవలం శ్వేతాబసు గురించి మాత్రమే మీడియా ఫోకస్ చేయడాన్ని సాక్షి ప్రశ్నించారు. అంతేకాదు.. వ్యాపారుల గురించి ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.
శ్వేతాబసు - సాక్షి
అందరు కూడా శ్వేతాబసు గురించి మాత్రమే రాస్తున్నారని, ఆమె వద్దకు వచ్చిన ప్రముఖుల గురించి ఎవరు రాయడం లేదని సాక్షి ప్రశ్నించారు.
శ్వేతాబసు - సాక్షి
టాలీవుడ్ నటి శ్వేతాబసు వ్యవహారం పైన ఇప్పటికే పలువురు సినిమా ప్రముఖులు జాలి చూపిన విషయం తెలిసిందే. శ్వేతాబసు పైన మీడియా అధిక ఫోకస్ చేస్తోందని తాజాగా ఆమెకు సీరియల్లో తల్లిగా నటించిన సాక్షి విమర్శించింది.