చెల్లెలికి వేధింపులు: అడ్డుకున్న అన్నయ్యను చంపేశారు
పోలీసుల కథనం ప్రకారం.. ఇండోర్లోని శ్రీకృష్ణ కాలనీలో నివాసం ఉంటున్న హిమాన్షు అలియాస్ షాను మన్వత్ తన చెల్లెలితో కలిసి బయటికి వెళ్లాడు. శ్రీకృష్ణ కాలనీకే చెందిన ముగ్గురు వ్యక్తులు వారి వెంటపడి హిమాన్షు చెల్లెలిని వేధింపులకు గురి చేశారు.
హిమాన్షు వారిని అడ్డుకున్నాడు. దీంతో రెచ్చిపోయిన దుండగులు అతడ్ని కత్తులతో తీవ్రంగా పొడిచి అక్కడ్నుంచి పరారయ్యారు. హిమాన్షును స్థానికులు హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాల పాలైన హిమాన్షు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులైన ఓం చౌహాన్(45), మహేంద్ర(20), రాజా(25)లను అరెస్ట్ చేశారు. కాగా, బాధితుడి కుటుంబానికి, నిందితుల కుటుంబానికి మధ్య ఉన్న పాతకక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు చెప్పారు. గత కొంత కాలంగా హిమాన్షు చెల్లెలిని నిందితులు, వారి కుటుంబసభ్యులు వేధింపులకు గురి చేస్తున్నారని పోలీసులు తెలిపారు.