వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలుకు జయ: మోడీకి సుబ్రహ్మణ్య స్వామి థ్యాంక్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కేసు విషయమై ప్రధాని నరేంద్ర మోడీకి బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ధన్యవాదాలు తెలిపారు. జయలలిత ఆస్తుల కేసులో న్యాయమూర్తి స్వేచ్ఛగా తన తీర్పును వెలువరించారని, మోడీ చట్టపరమైన చర్యలను ప్రభావితం చేయలేదన్నారు.

తాను తమిళనాడు రాష్ట్రంలో పెద్ద పార్టీ అయిన, అతిపెద్ద నాయకురాలితో ఫైట్ చేస్తున్నానని, ఈ నేపథ్యంలో ఈ కేసు పైన ప్రభావం పడుతుందని భావించానని చెప్పారు. తాను ఇదే విషయమై మోడీని కలిశానని, ఆయన తనకు పూర్తి హామీ ఇచ్చారన్నారు. చట్టపరంగా ఎవరైనా స్వేచ్ఛగా వెళ్లవచ్చునని మోడీ సూచించారు.

Jayalalithaa verdict: Subramanian Swamy says Modi permitted him to function freely!

ఈ కేసు విషయమై ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయని తెలిపారు. చాలామంది వారి వారి పూర్తి ప్రయత్నాలు చేశారని తెలిపారు. అయితే, ఈ కేసు విత్ డ్రా వరకు వెళ్లనందుకు సుబ్రహ్మమ్య స్వామి ధన్యవాదాలు తెలిపారు. ఆస్తుల కేసులో కోర్టు సరైన తీర్పు ఇస్తుందనే తాను భావించానని, అదే తీర్పు వచ్చిందన్నారు. అయితే, తీర్పు కొంత ఆలస్యమైందన్నారు.

English summary
Subramanian Swamy said that justice was delivered because Prime Minister Narendra Modi did not influence the disproportionate assets case of Tamil Nadu former Chief Minister J Jayalalithaa and let it go independently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X