రెచ్చగొట్టే వ్యాఖ్యలు: గిరిరాజ్పై అరెస్టు వారంట్
బొకారో (జార్ఖండ్): రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు గాను బీహార్ మాజీ మంత్రి, బిజెపి నాయకుడు గిరిరాజ్ సింగ్కు బుధవారంనాడు కోర్టు అరెస్టు వారంట్ జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
నరేంద్ర మోడీకి ఓటు వేయడం ఇష్టం లేనివారు పాకిస్తాన్కు వెళ్లిపోవచ్చునని ఆయన జార్ఖండ్లోని బొకారో జిల్లాలో వ్యాఖ్యానించారు. అందుకుగాను ఆయనకు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అమిత్ శేఖర్ అరెస్టు వారంట్ జారీ చేశారు.
గిరిరాజ్ సింగ్పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాజ ప్రాతినిధ్య చట్టం కింద కూడా ఏప్రిల్ 21వ తేదీన బోకారో పోలీసులు రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు గాను ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అదే ఆరోపణలపై గిరిరాజ్ సింగ్పై డియోగడ్ జిల్లా పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి.