కార్గిల్: ప్రాణం పోసిన ‘గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’(ఫొటో)
కార్గిల్: 1999లో కార్గిల్ యుద్ధం జరుగుతున్న సమయంలో భారత సైనికులు ఒకే ఒక్క రాత్రిలో ట్రక్కు కన్నా ఎత్తులో భారీ గోడను నిర్మించారు. ఎందుకంటే పాకిస్థాన్ దురాక్రమణదారులు భారత సైనికులతో పాటు వారు ఉపయోగించే ట్రక్కులను కూడా లక్ష్యంగా చేసుకున్నారు.
పాక్ సైన్యం దాడుల నుంచి తమ ట్రక్కులను కాపాడేందుకు జాతీయ రహదారి-1 చుట్టూ భారత సైన్యం ఒక్క రాత్రిలోనే ట్రక్కుల కంటే ఎత్తులో ఈ భారీ గోడను నిర్మించింది.
ఆ గోడ ఎంత దృఢమైనదంటే పాకిస్థాన్ సైన్యం బాంబు దాడులకు పాల్పడినా ఆ గోడలకు ఎలాంటి హానీ జరగదు. దీంతో మన సైన్యం ఉపయోగించే ట్రక్కులు కూడా భద్రంగా ఉంటాయి.
ఆ గోడ సైనికులకు లాజిస్టిక్స్ సప్లై చేసేందుకు, ఇతర పరికరాలను సురక్షితంగా అందించేందుకు ఎంతగానో ఉపయోగపడింది. పాకిస్థాన్ దాడుల నుంచి భారత ట్రక్కులను రక్షించడంతోపాటు అనేక మంది సైనికుల ప్రాణాలను కాపాడింది ఆ ‘గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా'.