సెల్ ఫోన్ కోసం హత్య చేసిన పదోతరగతి బాలుడు
టచ్ స్క్రీన్ సెల్ ఫోన్ కొనుక్కోవడానికి డబ్బు అవసరం అవడంతో పాటు బాలుడు హత్యా ప్రయత్నానికి పాల్పడ్డాడని నిర్దారించిన పోలీసులు అతడిని అరెస్టు చేసినట్లు కోలారు గోల్డ్ ఫ్యాక్టరీ ఎస్పీ భగవన్దాస్ వివరాలు తెలిపారు. బంగారుపేట పట్టణంలోని విజయనగర కాలనీలో నివాసం ఉంటున్న బాలుడు ఆ ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. చనిపోయిన మంజుల ఇంటికి ఎదురుగుండానే బాలుడి కుటుంబం నివాసం ఉండేది.
ఇంటికి ఎదురుగా నివసించడంతో బాలుడుతో మంజులకి పరిచయం ఏర్పడింది. ఎవరూ లేని సమయం చూసుకోని బాలుడు మంచినీరు కావాలని అడగడంతో ఆమె లోపలికి వెళ్లింది. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న బాలుడు ఇదే అదను అనుకోని ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దగ్గరలో ఉన్న కర్రను తీసుకోని బాలుడిపై ప్రతిఘటించినా.. బాలుడి ఆమె నోటిని అదిమిపెట్టి బ్లేడుతో గొంతుకోసి చంపేశాడు.
ఆ తర్వాత బీరువాలో ఉన్న నగదు, బంగారు ఆభరణాలుతో పారిపోయాడు. రక్తంతో తడిచిన చేతులతో ఇంట్లో నుండి వచ్చిన బాలుడ్ని చూసిన స్దానికులు ఏమైందని అడగ్గా, బైక్పై క్రింద పడ్డాడని వారికి అబద్దం చెప్పాడు. ఆ తర్వాత బాలుడు హొసకోటకు వెళ్లి, ఐదు రోజుల తర్వాత సేలంలోని తన మిత్రుల వద్దకు చేరుకున్నాడు.
కేసుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు బాలుడి కోసం గాలించగా సేలంలో ఉన్నాడని తెలియడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. టచ్ స్క్రీన్ సెల్ ఫోన్ కొనుగోలు చేసేందుకు అవసరమైన డబ్బుకోసమే తాను ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బాలుడు విచారణలో అంగీకరించాడని కోలారు గోల్డ్ ఫ్యాక్టరీ ఎస్పీ తెలిపారు.