విడాకుల స్టోరీ: మత్తు ఇచ్చి భార్యపై వ్యక్తి అత్యాచారం
ఆ దంపతులిద్దరు వేర్వేరుగా జీవిస్తూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. తాను 2008 అక్టోబర్ 4వ తేదీన జనక్పురి ప్రాంతానికి చెందిన దీపక్ సచ్దేవ్ను వివాహం చేసుకున్నట్లు బాధితురాలు తన ఫిర్యాదు తెలిపింది. దీపక్ తనను నిత్యం వేధించేవాడని, దాన్ని భరించలేక కూతురు పుట్టిన తర్వాత తాను ఇంటి నుంచి వెళ్లిపోయానని, అప్పటి నుంచి తాను షహీద్ కర్నైల్ సింగ్ నగర్లో ఉంటున్నానని ఆమె చెప్పింది.
తన కూతురు తండ్రి వద్ద ఉంటుందని, కూతురిని కలవడానికి అతను తనను కార్యాలయానికి పిలిచేవాడని, ఇటీవల తన కూతురిని కలవడానికి అతని కార్యాలయానికి వెళ్లానని, ఆ సమయంలో తనకు మత్తు పదార్థాలు కలిపిన శీతల పానీయం ఇచ్చాడని, అది తాగి తాను స్పృహ కోల్పోయిన తర్వాత తనపై అతను అత్యాచారం చేశాడని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది.
బాధితురాలు మంగళవారం ఫిర్యాదు చేయగా పోలీసులు జమాల్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.