వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విడాకుల స్టోరీ: మత్తు ఇచ్చి భార్యపై వ్యక్తి అత్యాచారం

By Pratap
|
Google Oneindia TeluguNews

Man drugs wife, rapes her in Punjab
లూథియానా: తన భార్యకు మత్తు పదార్థాలు ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత భర్త ఆమెపై అత్యాచారం చేశాడు. రియల్ ఎస్టేట్ సలహాదారుగా పనిచేస్తున్న అతను తన కార్యాలయంలో భార్యపై అత్యాచారం జరిపాడు. ఈ సంఘటన లూథియానాలోని భమియన్ కలాన్ ప్రాంతంలో జరిగింది.

ఆ దంపతులిద్దరు వేర్వేరుగా జీవిస్తూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. తాను 2008 అక్టోబర్ 4వ తేదీన జనక్‌పురి ప్రాంతానికి చెందిన దీపక్ సచ్‌దేవ్‌ను వివాహం చేసుకున్నట్లు బాధితురాలు తన ఫిర్యాదు తెలిపింది. దీపక్ తనను నిత్యం వేధించేవాడని, దాన్ని భరించలేక కూతురు పుట్టిన తర్వాత తాను ఇంటి నుంచి వెళ్లిపోయానని, అప్పటి నుంచి తాను షహీద్ కర్నైల్ సింగ్ నగర్‌లో ఉంటున్నానని ఆమె చెప్పింది.

తన కూతురు తండ్రి వద్ద ఉంటుందని, కూతురిని కలవడానికి అతను తనను కార్యాలయానికి పిలిచేవాడని, ఇటీవల తన కూతురిని కలవడానికి అతని కార్యాలయానికి వెళ్లానని, ఆ సమయంలో తనకు మత్తు పదార్థాలు కలిపిన శీతల పానీయం ఇచ్చాడని, అది తాగి తాను స్పృహ కోల్పోయిన తర్వాత తనపై అతను అత్యాచారం చేశాడని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది.

బాధితురాలు మంగళవారం ఫిర్యాదు చేయగా పోలీసులు జమాల్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

English summary
A real estate advisor has been booked for allegedly raping his wife after drugging her with sedatives at his office at Bhamiyan Kalan area. The two do not live together and have reportedly filed for divorce.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X