రైలు కిందపడి వ్యక్తి సూసైడ్: మోడీ ప్రధాని అవుతారని..
అంతేగాక తన కుటుంబాన్ని ఆదుకోవాలని మోడీని కోరాడు. పోలీసుల కథనం ప్రకారం... బాధితుడు ఓం ప్రకాష్ తివారీ గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ప్రకాష్ వేగంగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. మృతుడి పోస్టుమార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో అతని వద్ద ఓ సూసైడ్ నోట్ లభించిందని చెప్పారు. ఆ నోట్ హిందీలో రాసివుందని తెలిపారు.
‘నరేంద్ర మోడీ గారూ.. మీరు తప్పకుండా భారత ప్రధాని అవుతారు. అది నాకు తెలుసు. నేను తీవ్ర సమస్యలతో విసిగిపోయాను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా కుటుంబాన్ని మీరు(మోడీ) ఆదుకుంటారని ఆశిస్తున్నాను' అని తివారీ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. బాధితుడు రాసిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణను కొనసాగిస్తామని పోలీసులు పేర్కొన్నారు.