వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలు కిందపడి వ్యక్తి సూసైడ్: మోడీ ప్రధాని అవుతారని..

|
Google Oneindia TeluguNews

Man kills self, asks Modi to look after kin
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో విషాధ ఘటన చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం ఓ వ్యక్తి (35) ఘజియాబాద్‌లో వేగంగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ అతను ఓ సూసైడ్ నోట్‌ను కూడా వదిలేశాడు. భారతీయ జనతా పార్టీ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీనే దేశానికి ప్రధాన మంత్రి అవుతారని ఆ లేఖలో రాశాడు.

అంతేగాక తన కుటుంబాన్ని ఆదుకోవాలని మోడీని కోరాడు. పోలీసుల కథనం ప్రకారం... బాధితుడు ఓం ప్రకాష్ తివారీ గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ప్రకాష్ వేగంగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. మృతుడి పోస్టుమార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో అతని వద్ద ఓ సూసైడ్ నోట్ లభించిందని చెప్పారు. ఆ నోట్ హిందీలో రాసివుందని తెలిపారు.

‘నరేంద్ర మోడీ గారూ.. మీరు తప్పకుండా భారత ప్రధాని అవుతారు. అది నాకు తెలుసు. నేను తీవ్ర సమస్యలతో విసిగిపోయాను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా కుటుంబాన్ని మీరు(మోడీ) ఆదుకుంటారని ఆశిస్తున్నాను' అని తివారీ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. బాధితుడు రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణను కొనసాగిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

English summary
A 35-year-old man committed suicide by jumping in front of a train in Ghaziabad late on Monday, leaving a suicide note predicting Narendra Modi would be the next PM and asking him to take care of his family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X