వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవతారమని బాలికను ఇంటి ముందు పాతిపెట్టారు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Minor buried in front of house, family claims it's a 'samadhi'
జైపూర్: డయేరియాతో మరణించిన పదేళ్ల బాలిక శవాన్ని కుటుంబ సభ్యులు గురువారంనాడు ఇంటి ముందే పాతిపెట్టారు. ఆమె దేవత అవతారమని, ఆమె సమాధిలోకి వెళ్లిందని చెబుతున్నారు. దీనిపై పోలీసులు, జిల్లా అధికారులు జోక్యం చోసుకున్నారు.

ఖుష్బూ అనే బాలిక డయేరియాతో బాధపడుతూ రాజస్థాన్‌లో భరత్‌పూర్ జిల్లాలో బుధవారం రాత్రి చనిపోయింది. గురువారంనాడు శవాన్ని కుటుంబ సభ్యులు ఇంటి ముందు పాతిపెట్టారు. ఆమె దేవత అవతారమని, ఆమె కోరిక మేరకు ఇంటి ముందు సమాధి చేశామని స్థానికులకు చెప్పారు.

అక్కడ ఓ టెంట్ వేసి, సమాధి స్థలం వద్ద పూజలు చేయడం ప్రారంభించారని భరత్‌పూర్ పోలీసు సూపరింటిండెంట్ రాహుల్ ప్రకాశ్ చెప్పారు. బాలిక కుటుంబ సభ్యులు నాట్ అనే సంచార జాతికి చెందినవారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

టెంట్‌ను, ఇతర ఏర్పాట్లను అధికారులు తొలగించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అసహజమైన మరణంగా కేసు నమోదు చేసినట్లు రాహుల్ ప్రకాష్ చెప్పారు.

English summary

 A 10-year-old girl, who died of diarrhoea, was on Thursday buried in front of her house by her family members who claimed that she was incarnation of a goddess and has taken 'samadhi'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X